Posts

Showing posts from December, 2019

పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు

భారత విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగి 2019 డిసెంబర్ 20 నాటికి ఆల్ టైమ్ హై కి చేరుకుని 455 బిలియన్ల అమెరికా డాలర్లుగా వున్నాయి. 2019 మార్చి నాటి నిల్వలు 412 బిలియన్ డాలర్లతో పోలిస్తే చెప్పుకోదగ్గ స్థాయిలో అధికం. ఫోరెక్స్‌ నిల్వలు పెరగడానికి ప్రధాన కారణం - విదేశీ కరెన్సీ ఆస్తులు - FCA పెరుగుదలు. 2019 మార్చితో పోలిస్తే FCA పదిశాతం పెరిగింది. అమెరికా డాలరు, యూరో, పౌండ్ స్టిర్లింగ్, జపాన్ ఎన్ వంటి విదేశీ కరెన్సీలతో FCAను నిర్వహిస్తారు. ఆర్.బి.ఐ చేసే విదేశీ కరెన్సీ క్రయవిక్రయాల మూలంగా ప్రధానంగా - FCAలో హెచ్చు తగ్గులు జరుగుతూ వుంటాయి. విదేశీ మారకం పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వానికి విదేశాల నుంచి వచ్చే నిధులు వంటి వాటి ద్వారా కూడా FCAలో హెచ్చు తగ్గులు ఏర్పడుతూ వుంటాయని - ఆర్.బి.ఐ తన నివేదికలో తెలిపింది. ఫోరెక్స్‌ కు బంగారం, ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు - SDR, IMF లో RTP ద్వారా నిధులు చేరుతూ వుంటాయి. మొత్తం ఫోరెక్స్ నిధుల‌లో FCA వాటా అత్య‌ధికంగా 93 శాతం వుంటుంది. బంగారం వాటా 6 శాతం దాకా వుంటుంది. విదేశీ మార‌క నిల్వ‌ల డిమాండ్ ఆర్థిక వ్య‌వ‌స్థ స‌ర‌ళ‌త్వం, లిక్విడిటీ అవ‌స‌రాలు త‌దిత‌ర అ...

ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్ష ఎన్నికలు

ఆఫ్ఘనిస్థాన్ లో ప్రాథమిక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడటంతో యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఆ దేశం ప్రజాస్వామ్య సంస్థలను ఒక తాటిపై తెచ్చే దిశగా మరో మైలురాయిని అధిగమించింది. 50.46 శాతం ఓట్లను సాధించిన ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఎన్నికల్లో గెలుపొందినట్లు ఆఫ్ఘని స్తాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయన సమీప ప్రత్యర్థి, మాజీ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లా రెండు లక్షల ఓట్ల తేడాతో ఎన్నికల్లో పరాజితులయ్యారు. తాలిబన్ల ఉన్మాద హింస నేపథ్యంలో పౌర పాలన నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్న ఆ దేశంలో ఎన్నికల్లో మోసాలను అరికట్టడంలో స్వతంత్ర ఎన్నికల సంఘం అత్యంత పకడ్బందీగా వ్వవహరించింది. ఫలితంగా బయోమెట్రిక్ పరీక్షల్లో పట్టుబడిన వేలాది మంది ఓటర్లు అనర్హతతో వెనుతిరిగారు. అయినప్పటికీ ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయి. ప్రతి ఒక్క ఫిర్యాదును పరిశీలిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది. ఫిర్యాదుల పరిశీలన కొన్ని వారాలో నెలలో కొనసాగవచ్చు .ఒకవేళ అప్పుడు అష్రఫ్ ఘనీకి పోలైన ఓట్లు యాభై శాతానికి తక్కువగా ఉంటే రెండవ పర్యాయం ప్రధాన అభ్యర్థుల మధ్య పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ సుదీర్ఘ ప్రక్రియ...

ఎవరెస్టు శిఖర అధిరోహణ నియమాలను కఠినతరం చేయనున్న నేపాల్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం,8848 మీటర్ల ఎత్తున్న ఎవరెస్ట్ ఉన్న నేపాల్ కు ప్రతి ఏటా పర్వతారోహణ ద్వారా చక్కని ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ ఏడాది మేలో శిఖరారోహణ ప్రయత్నంలో 11 మరణాలు సంభవించడం ఆందోళన కలిగించింది.2015 లో హిమాలయ ప్రాంతాల్లో తీవ్రమైన భూకంపం సంభవించడంతో 22 మరణాలు నమోదయ్యాయి. ఏప్రిల్ ఇరవై అయిదు న మంచు చరియలు విరిగిపడటంతో అనేకులు పర్వతారోహకులు అందులో చిక్కుకు పోయారు. ఈ ఏడాది ఎనిమిది వందలకు పైగా పర్వతారోహకులు శిఖరానికి చేరుకునేందుకు ప్రయత్నించారు. చాలామందికి గంటల కొద్దీ ఎనిమిది వేల మీటర్ల ఎత్తులో మృత్యు ప్రాంతంగా వ్యవహరించబడే చోట ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రతిఒక్కరూ అనుకూల వాతావరణం స్వల్పంగా ఉన్న సమయంలోనే శిఖరానికి చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఎక్కువ ఎత్తులో ఉండటం వలన ఏర్పడిన అనారోగ్యం అలసటలతో మరణాలు సంభవించాయి. ఈ ఏడాది మే ఇరవై రెండు న ఒక్క రోజునే రెండు వందల ఇరవై మూడు మంది పర్వతారోహకులు శిఖరాగ్రాన్ని చేరినట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది పర్వతారోహణ చేసిన వారి సంఖ్య రెండు వందల నాలుగును ఈ ఏడాది విజయవంతంగా అధిగమించారు. ప్రతి ఏటా పర్వతారోహణ కాలంలో ఎదురవుతున్న భయంకర...

మతపరమైన వివక్ష గల దేశాల జాబితాలో పాకిస్తాన్ ను చేర్చిన అమెరికా

మత పరమైన వివక్ష గల దేశాలలో ఒక దేశంగా పాకిస్తాన్ ను అమెరికా గుర్తించింది. ప్రత్యేక ఆందోళనకర దేశాలుగా మయన్మార్, చైనా, ఎరిట్రియా, ఇరాన్, ఉత్తర కొరియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, తజికిస్తాన్, టర్కిమెనిస్తాన్ దేశాలను అమెరికా నిర్ధారించింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం 1998 కింద అమెరికా ఈ నిర్ధారణ గావించింది. మత స్వేచ్ఛ ఉల్లంఘన కొనసాగుతున్న, సహిస్తున్న, దేశాలుగా ఈ జాబితాలోని దేశాలను వర్గీకరించింది.అమెరికా విధించే ఆంక్షలతో సహా మరిన్ని చర్యలను ఈ జాబితాలోని దేశాలు ఎదుర్కొంటాయి. అయితే ఇలా పాకిస్తాన్ పై ముద్ర వేయడం కొన్ని దేశాలను గురి చూసి ఎంపిక చేశారు అనడాన్ని ప్రతిబింబిస్తుందని, మత స్వేచ్ఛను పెంపొందించేందుకు దోహద పడదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అన్నది. రాజ్యాంగపరమైన పరిరక్షణ కింద అన్ని మతాల ప్రజలు మత స్వేచ్ఛను అనుభవిస్తారని, బహుళ మతాలతో కూడిన దేశం పాకిస్తాన్ అని ఆ దేశ విదేశాంగ కార్యాలయం అన్నది. తమ తమ మతాలను ప్రజలు స్వేచ్ఛగా అనుసరించేందుకు తమ కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలు సమగ్ర ప్రయత్నాలు చేశాయని తెలిపింది, మైనారిటీల ప్రార్థనా స్థలాల భద్రతను పవిత్రతను నిర్దేశించేది గా తమ దేశ అత్యు...

భారతదేశంలో జల నిర్వహణ దిశగా సమగ్ర విధానం

కీర్తిశేషులైన మాజీ ప్రధాన‌మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రతిష్టాత్మక జ‌ల నిర్వహణ పథకం ‘అటల్ భూజ‌ల యోజన’ను భార‌త ప్ర‌భుత్వం జాతికి అంకితం చేసింది. త‌ద్వారా జ‌ల సంక్షోభం నుంచి లక్షలాది ప్ర‌జ‌లను గ‌ట్టెక్కించే త‌న‌ దృఢ సంక‌ల్పాన్ని చాటింది. వాస్త‌వానికి ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర మోదీ రెండోసారి బాధ్య‌త‌లు చేప‌ట్టాక ‘జలశక్తి’ మంత్రిత్వ శాఖ‌ను ఏర్పాటు చేయ‌డంతోనే జ‌ల సమస్యను మన దేశం ఎలా ప‌రిష్క‌రించ‌బోయేదీ ప్ర‌పంచానికి తెలియజెప్పారు. కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో జల సంబంధ విభాగీకరణకు స్వస్తి ప‌లికి ఒక విపుల, విశిష్ట విధానంవైపు ముంద‌డుగు ప‌డింది. ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లకు అనుగుణంగా దేశ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌క‌పోతే న‌వ భార‌త నిర్మాణం ఫ‌ల‌వంతం కాబోదు. అందుకే ప్ర‌భుత్వం ‘అటల్ భూజల యోజన’కు శ్రీకారం చుట్టింది. దీని అమలుతో గుజరాత్, రాజస్థాన్, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని 78 జిల్లాల్లో భూగ‌ర్భజ‌ల మ‌ట్టం క్షీణ‌త స‌మ‌స్యకు ప‌రిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా ప్ర‌త్యామ్నాయ పంటల సాగు అవ‌స‌రంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌లుగుతుంది. దేశంలో ప్ర...

వ్యూహాత్మ‌క సంబంధాల‌ను ప‌టిష్టం చేసుకుంటున్న భార‌త్‌-ఒమ‌న్‌

ప‌ర్షియా జ‌లసంధి ముఖ‌ద్వారంలోగ‌ల ఒమ‌న్‌కు దాని పొరుగుదేశాల‌తో పోలిస్తే అంత‌ర్జాతీయంగా చెప్పుకోగ‌ద‌గిన గుర్తింపు ఏదీలేదు. అయితే, జ‌ల‌సంధిలోని వ్యూహాత్మ‌క ప్ర‌దేశంలో ఉన్న దృష్ట్యా భార‌త పొరుగు దేశాల జాబితాలో మాత్రం ఆ దేశానికి ప్ర‌ముఖ‌ స్థానం ల‌భించింది. చాలాకాలం నుంచీ వీడ‌ని అంతర్గత క‌ల్లోలంతోపాటు ఆర్థికాభివృద్ధి లేమిలో చిక్కుకున్న ఈ దేశం- సుల్తాన్ ఖ‌బూస్ నాయకత్వంలో గణనీయ ప్ర‌గ‌తివైపు ప‌య‌నిస్తోంది. సుల్తాన్ 1970లో పాల‌న బాధ్య‌త‌లు స్వీక‌రించాక సంక్షేమం దిశ‌గా చమురు సంపదను మ‌ళ్లించారు. త‌ద్వారా ఆర్థిక పురోగతి సాధించి, ప్ర‌జా శ్రేయస్సువైపు న‌డిపారు. అంతేకాకుండా సుల్లాన్ ఖ‌బూస్ నేతృత్వాన ఒమ‌న్‌కు ఇరుగుపొరుగు దేశాల‌తో సంబంధాల్లో స‌మ‌తూకం సాధ్యమైంది. దీంతో ముక్క‌చెక్క‌లుగా ఉన్న జ‌ల‌సంధి ప్రాంతంలో కీల‌క పాత్ర పోషించే వీలు ఏర్ప‌డింది. ఆ మేర‌కు ప్రాంతీయ ఉద్రిక్త‌త‌ల‌ను ఉప‌శ‌మింప‌జేయ‌డంలో, ప‌రోక్ష దౌత్య‌మ‌ద్ద‌తు ద్వారా వివాదాస్ప‌ద అంశాల ప‌రిష్కారంలో ఒమ‌న్ పోషించిన పాత్ర ఆ దేశ ప్రాముఖ్యాన్ని చాటుతోంది. ఒమ‌న్ ప్రాముఖ్యాన్ని గుర్తించిన భార‌త్- కొన్ని ద‌శాబ్దాలుగా ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాల‌న...

19 వ భారత – ఇరాన్ సంయుక్త కమిషన్ సమావేశం

భారత్ – ఇరాన్ సంయుక్త కమిషన్ 19వ సమావేశంలో పాల్గొనేందుకు, భారత విదేశాంగ మంత్రి డాక్టర్. జైశంకర్ ఇరాన్’ లో పర్యటించారు. భారత, ఇరాన్ దేశాల విదేశాంగ మంత్రులు ఇద్దరూ అధ్యక్షత వహించే సంయుక్త కమిషన్, మిత్ర దేశాల మధ్య గల స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఏర్పరచుకున్న ఒక వ్యవస్థ. ఒక యంత్రాంగం. ఈ పర్యటన సందర్భంగా డాక్టర్ జైశంకర్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్. హస్సన్ రౌహనీతో కూడా సమావేశమయ్యారు. సంయుక్త కమిషన్ సమావేశం వివరాలను అధ్యక్షునికి వివరించారు.అదే విధంగా భారత విదేశాంగ మంత్రి, ఇరాన్ సర్వోన్నత భద్రతా మండలి కార్యదర్శి, రేర్ అడ్మిరల్ అలీ శంఖానీ, ఇరాన్ రహదారులు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మొహమ్మద్ ఇస్లామీతోనూ సమావేశమయ్యారు. ఇరాన్ – అమెరికా సంబధాలు స్థంబించి ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సమయంలో భారత్ – ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునే లక్ష్యంతో జరిగిన ఈ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్ అణు ఒప్పందం నుంచి ఇరాన్ ఏకపక్షంగా తప్పుకోవడంతో ఇరాన్ – అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుదీర్ఘ కాలంగా ఉభయ దేశాల మధ్య సంబధాలలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ...

భారత్ – చైనా 22 వ ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో పురోగతి

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, భారత దేశంలో పర్యటించారు భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్’తో సరిహద్దు సమస్యలపై చర్చించేందుకు భారత్’ లో పర్యటించిన వాంగ్, భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. వాంగ్ పర్యటన సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రతినిధుల చర్చలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అందుకు అనేక కారణాలున్నాయి.అందులో ప్రధానంగా చెప్పుకోవలసింది, 2019 అక్టోబర్’లో చెన్నై సమీపాన సాగర తీరంలోని మహాబలిపురంలో భారత ప్రధానమంత్రి, చైనా అధ్యక్షడు జరిపిన రెండవ అనధికార సదస్సు. ఈ సదస్సులోనే ఇరువురు నాయకులు సరిహద్దుల్లో శాంతి సాధన కోసం ఉభయ మరిన్ని దేశాలు విశ్వాస నిర్మాణ చర్యలు – తీసుకోవాలని ఒక అవగాహనకు వచ్చారు. అదే స్పూర్తిని ప్రతిధ్వనిస్తూ, భారత జాతీయ భద్రతా సలహాదారు, అజిత్ దోవల్, ఉభయ దేశాల నాయకులు, “ దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటుగా, సరిహద్దు సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు నూతన దుక్పధం, నూతన వ్యూహాత్మక మార్గదర్శకత్వం అవసరం” అని పేర్కొన్నారు. మరో వంక చైనా, చర్చల అనంతరం “యాజమాన్య నిబంధనల రూపకల్పన” , “సరిహద్దు దళాల మధ్య ఇచ్చిపుచ్చుకునే విధంగా సమాచార వ్యవస్థను బలో...

విస్తరణ దిశగా   ఆర్థిక  వ్యవస్థ అడుగులు 

దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరణ దిశగా అడుగులు వేస్తోందని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. GDP వృద్ధిరేటు మందగమనం సాగిస్తున్న నేపధ్యంలో ప్రధానమంత్రి, రాన్నున్న ఐదేళ్ళలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల శిఖరానికి చేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఆర్థిక విధానాల పట్ల మరో మారు సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని, రానున్న సంవత్సరాలలో ఫలితాలు అందుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. వందేళ్ళు పూర్తిచేసుకున్న, అసోసియేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ASSOCHAM వార్షిక సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా కుదించుకు పోతోందన్న భావనను తొలిగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బలమైన వాదనను వినిపించారు. నిజానికి గడచిన ఐదు త్రైమాసికాలలో, GDP వృద్ధి రేటు కుదించుకు పోవడం గురించి చాలామంది చాలా చెప్పారు.అయితే, ఇందుకు అంతర్జాతీయ పరిణామలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం కూడా కారణం. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం సాగుతోం...

సౌదీ-ఖతార్ థావ్: ఎ ప్లే ఆఫ్ సాఫ్ట్ హావభావాలు

ఖతార్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తోందన్న ఆరోపణపై, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహరేన్ దేశాల కూటమి ఖతార్’తో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేకున్న నేపధ్యంలో సౌదీ – ఖతార్ మధ్య తీవ్రంగా దెబ్బ తిన్న సంబంధాలు మెరుగవుతున్న సంకేతాలకు ఇటీవల జరిగిన 40వ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ –GCC- సర్వోన్నత సదస్సు వేదికగా నిలిచింది. రియాద్’లో జరిగిన GCC 2019 సదస్సు హాజరు కావాలని కోరుతూ, సౌది రాజు సల్మాన్ బిన్ అబ్డుల్లా అల్ సుద్, ఖతార్ ఎమిర్ షేక్ తమిన్ బిన్ హమద్ అల్ తనీకి వ్యక్తిగత ఆహ్వానం పంపారు.సౌదీ రాజు ఆహ్వానానానికి సానుకూలంగా స్పందించిన ఖతార్, ఆ దేశ ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నసర్ అల్ తనీ’ ని సదస్సులో పాల్గొనేందుకు పంపింది. 2017 అరేబియా ద్వీపకల్పంతో ఖాతార్’ సంబధాలు పూర్తిగా వేరు చేసే లక్ష్యంతో, సౌదీ అరేబియా, ఖతార్’ సరిహద్దుల పొడవునా 200 మీటర్ల వెడల్పు ‘సల్వా’ కాలువ తవ్వకానికి సంకల్పించిన దరిమిలా జరిగిన సదస్సులకంటే, 2019 సదస్సుకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించింది. ఉబాయ దేశాల మధ్య కరుగతున్న దూరానికి ఇదొక శుభ సంకేతం.  ఈ నేపధ్యంలో, ఉభయ దేశాలు చూపుతున్న సానుకూల స్పందనలు సౌదీ – ఖతార్ ...

భారత్ అమెరికా ల రెండవ 2+2 సమావేశం

భారత్ అమెరికాల రక్షణ విదేశాంగ మంత్రులు, సీనియర్ అధికారుల మధ్య రెండవ 2+2 సమావేశం ఈ వారం వాషింగ్టన్ డీసీలో విజయవంతంగా ముగిసింది . ప్రాంతీయ భద్రతా వాతావరణంలో కీలకమైన పరిణామాలపై అభిప్రాయాల మార్పిడి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం, ఆఫ్గనిస్తాన్ స్థిరీకరణ, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి యుత స్థిర క్రమ సాధనలు ఈ చర్చ సందర్భంగా ఎజెండాలోని ప్రధాన అంశాలు. పారిశ్రామిక భద్రతలో సహకారం కోసం ఒక ఒప్పందంపై సంతకం చేయటం ఈ సమావేశ ప్రధాన ఫలితం. రక్షణ పరిశోధన, అభివృద్ధిలో ద్వైపాక్షిక సహకార ప్రక్రియను ఇది సులభతరం చేస్తుంది. ఇరు దేశాల సైనిక దళాల పరస్పర సామర్థ్య పెంపుదల ఉద్దేశ్యంతో కమ్యూనికేషన్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ ఎగ్రిమెంట్ లేదా కాంకాస పై సంతకం చేయటం గత ఏడాది సెప్టెంబర్లో నూఢిల్లీ లో జరిగిన 2+2 సంభాషణ మొదటి రౌండ్లో కీలకమైన చర్య. కాగా రెండవ 2+2 చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య లోతైన రక్షణ, భద్రతా సంబంధాలు మరింత మెరుగయ్యాయి. ప్రపంచ, ప్రాంతీయ భద్రతలపై అభిప్రాయాల మేళవింపులు దృఢతరంగా చెప్పటం ద్వారా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్ అమెరికాల ఈ ప్రయత్న విజయం పై అపోహలు ఉన్నాయి. అమె...

పురోగ‌మ‌న‌దిశ‌లో భార‌త్ - పోర్చుగ‌ల్ సంబంధాలు

పోర్చుగీస్ ప్ర‌ధాని ఆంటోనియో కోస్టా తిరిగి ఆ ప‌ద‌వికి ఎన్నిక‌యిన త‌రువాత - యూర‌ప్ కు ఆవ‌ల భార‌త్ సంద‌ర్శ‌న అనేక కార‌ణాల‌రీత్యా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు కోస్టా ప్ర‌ధాన‌మంత్రి మోదీని మూడుసార్లు వివిధ సంద‌ర్భాల‌లో క‌లుసుకున్నారు. భార‌త్ ఆయ‌న‌కు ప్ర‌వాసీ భార‌తీయ స‌మ్మాన్ అవార్డును అందించిన‌ప్పుడు 2017 జ‌న‌వ‌రిలో భార‌త్ ను సంద‌ర్శించారు. గుజ‌రాత్ లో నిర్వ‌హించిన వైబ్రెంట్ గుజ‌రాత్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ లో పాల్గొని ప్ర‌సంగించారు. అదే సంవ‌త్స‌రంలో ఆ త‌రువాత ప్ర‌ధాని మోది పోర్చుగీస్ ను సంద‌ర్శించిన‌ప్పుడు వివిధ అంశాల‌పై స‌హ‌కారానికి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రిపారు. పోర్చుగ‌ల్ ఉన్న 65 వేల మంది భార‌తీయులు - ఆ దేశానికి అందిస్తున్న సేవ‌ల‌ను కొనియాడిన మోదీ - వారు ఆ దేశానికి నిజ‌మైన భార‌త‌రాయ‌బారుల‌ని కొనియాడారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు 2018లో పోర్చుగ‌ల్ ను సంద‌ర్శించారు. ద‌శాబ్దాల పై పై చ‌ర్యల అనంత‌రం భార‌త్ - విదేశీ విధాన నిర్ణేత‌లు - పోర్చుగ‌ల్ పై దృష్టి సారించారు. పోర్చుగ‌ల్ తో సంబంధాల మెరుగు విష‌యంలో భార‌త్ కు స‌కారాత్మ‌క కార‌ణాలు వున్నాయి. భార‌త్ కు యూర‌ప్ ముఖ‌ద్వారం పోర్చ...

పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ తీర్మానాన్ని నిర్ద్వందంగా తిర‌స్క‌రించిన భార‌త్‌

వివిధ సంస్థ‌లు ప‌ర‌స్ప‌రం సంఘ‌ర్షించుకునే ఒక దేశం - పాకిస్తాన్‌. భార‌త్ ప్ర‌తి ఆంత‌రంగిక వ్య‌వ‌హారాన్ని చ‌ర్చించే దుర అల‌వాటు గ‌ల దేశం కూడా పాకిస్తాన్‌. భార‌త్ పార్ల‌మెంట్ ఆమోదం పొంది, చ‌ట్టంగా మారిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (CAA) పై పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ చ‌ర్చించింది. భార‌త్ అంత‌ర్గ‌త అంశ‌మైన ఈ విష‌యంపై చ‌ర్చించే హ‌క్కు పాకిస్తాన్ తో పాటు ఏ ఇత‌ర దేశానికి లేదు. ఆప్గ‌నిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ ల‌లో వివ‌క్ష‌కు గుర‌వుతున్న మెనార్టీల‌కు భార‌త పౌర‌స‌త్వం క‌ల్పించేందుకు ఉద్దేశించిన‌ది ఈ చ‌ట్టం. మైనార్టీల ప‌ట్ల అత్యంత వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నందుకు ప్ర‌పంచ దేశాలు తీవ్రంగా త‌ప్పు ప‌ట్టుతుండ‌డంతో భార‌త్ CAA చ‌ట్టంపై పాకిస్తాన్ గ‌గ్గోలు పెడుతోంది. త‌న పౌరుల‌ను కాపాడ‌వ‌ల‌సిన ప్ర‌భుత్వం మైనార్టీల‌ను అన్ని ర‌కాలుగా వివ‌క్ష‌కు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్న దారుణ‌మైన రికార్డు గ‌ల దేశం పాకిస్తాన్‌. మ‌త‌ధూష‌ణ ఆరోప‌ణ‌ల‌పై అరెస్ట్ చేసిన క్రైస్త‌వ వ‌నిత ఆసియా బిబిని పాకిస్తాన్ సుప్రీంకోర్టు విడిచిపెట్టిన‌ప్పుడు అక్క‌డి ఛాంద‌స‌వాదులు ఏ విధంగా స్పందించింది. ప్ర‌పంచ‌మంతా చూసింది. ఆమె...

భార‌త్ - ప‌సిఫిక్ ప్రాంత 1.5 సంప్ర‌దింపులు

భార‌త్ - ప‌సిఫిక్ ప్రాంతం స్వేచ్ఛా ప్రాంతంగా మారాల‌న్న భౌగోళిక వాద‌న విన‌ప‌డుతున్న త‌రుణంలో న్యూఢిల్లీ 1.5 రెండు దారుల‌, 6వ హిందూ మ‌హాస‌ముద్ర సంప్ర‌దింపులు, 11వ ఢిల్లీ సంప్ర‌దింపుల‌ను నిర్వ‌హించింది. స్వేచ్ఛాపూరిత‌, నింబంధ‌న‌ల‌కు లోబ‌డిన ఇండో - ప‌సిఫిక్ ప్రాంత ఏర్పాటుపై చ‌ర్చ‌లు దీని ప్ర‌ధాన ఉద్దేశం. 2018లో షాంగ్రిలా సంప్ర‌దింపుల‌కు అనుగుణంగా, ఇండో - ప‌సిఫిక్ పై ఆసియా దృక్ప‌థాన్ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఇది జ‌రిగింది. గ‌ల్ఫ్‌, ఆఫ్రికా దేశాల‌తో పాటూ, తూర్పు హిందూ మ‌హాస‌ముద్రం, ప‌శ్చిమ స‌ముద్రంతో కూడిన ఇండో - ప‌సిఫిక్ ప్రాంతంపై భార‌త్ దృక్ప‌థాన్ని ఈ స‌మావేశంలో భార‌త్ విదేశాంగ మంత్రి డాక్ట‌ర్ జ‌య‌శంక‌ర్ వివ‌రించారు. ఇండో-ప‌సిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఇందులో భాగాస్వామ్యులైన దేశాల‌న్నిటి అభిప్రాయాల‌ను, తెలుసుకుని, స‌హ‌కార స్ఫూర్తితో ముందుకు సాగాల‌న్నది ప్ర‌ధాన ఉద్దేశం. ఇండో - ప‌సిఫిక్ స‌ముద్ర సంప్ర‌దింపుల‌ను భార‌త్ న‌వంబ‌ర్ 2019లో ప్రారంభించింది. స‌ముద్ర జ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌, వాటి ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ‌, స‌ముద్ర వ‌న‌రుల స‌మ‌గ్ర వినియోగం వంటి అంశాల‌ను చ‌ర్చించి - ఒక స‌హ‌కార వేదిక‌ను రూపొ...

వాతావ‌ర‌ణ మార్పు ప్ర‌భావాన్ని తొల‌గించేందుకు మాడ్రిడ్ స‌మావేశంలో భార‌త్ అజెండా

వాతావ‌ర‌ణ మార్పుల‌న‌దే ఒక స‌త్యం. ఎవ‌రు కాద‌న‌లేనిది. ఏ ఒక్క దేశం చ‌ర్య - ప్ర‌తి చ‌ర్య మూలంగా ఇది ఆధార‌ప‌డి లేదు గ‌నుక ప్ర‌పంచంలోని ఏ ద‌శం కూడా దాని ప్ర‌భావం సోక‌కుండా వుండ‌లేదు. వాతావ‌ర‌ణ మార్పుల ద్వారా ఏర్ప‌డిన ప్ర‌భావాన్ని భార‌త్ ఇప్ప‌టికే చ‌వి చూస్తోంది. అకాల వ‌ర్షాలు, విప‌రీత‌మైన ఎండ‌లు, అతి శీత‌ల స‌మ‌యాలు దీని మూలంగా జ‌రుగుతున్న‌వే. ఈ ప్ర‌భావం ఆహార ధాన్యాల ఉత్ప‌త్తి, ఆరోగ్యం వంటి వాటిపై ప‌డుతోంది. 2015 ప్యారిస్ ఒప్పందాన్ని 2020 నుంచి ఏ విధ‌మైన కార్యాచ‌ర‌ణతో పూర్తిగా అమ‌లు చేయ‌వ‌చ్చున‌న్న అంశంపై వాతావ‌ర‌ణ మార్పుల‌పై ఇటీవ‌ల జ‌రిగిన మాడ్రిడ్ స‌మావేశంలో కూలంక‌షంగా చ‌ర్చించారు. రెండు వారాల పాటు జ‌రిగిన ఈ స‌మావేశాల్లో వాతావ‌ర‌ణ‌మార్పుల ప్ర‌భావంపై వైజ్ఞానిక ప‌ర‌మైన హెచ్చ‌రిక‌లు, భూగోళాన్ని, మాన‌వ స‌మాజాన్ని వీటి నుంచి ఏ విధంగా కాపాడ‌టం వంటి అంశాల‌పై స‌మీక్షించారు. ప్ర‌కృతిపై ఇప్ప‌టికే ప‌డిన దుష్ ప్ర‌భావాన్ని తొల‌గించాలంటే ఆశించిన ల‌క్ష్యాల సాధించాలంటే వివిధ దేశాలు త‌మ కార్యాచ‌ర‌ణను వేగ‌వంతం చేయ‌న‌వ‌స‌రం వుంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి సంస్థ అయిన వాతావ‌ర‌ణ మార్పుల‌పై ఏర్పాటైన అంత‌ర్ ప్ర‌...

భార‌త్ మాల్దీవుల మ‌ధ్య 6వ సంయుక్త క‌మీష‌న్ స‌మావేశం

భార‌త్‌, మాల్దీవుల మ‌ధ్య 6వ సంయుక్త క‌మీష‌న్ - JCM స‌మావేశం న్యూఢిల్లీలో జ‌రిగింది. ఈ స‌మావేశానికి మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్ ష‌హీద్‌, భార‌త విదేశాంగ మంత్రి డా.జ‌య‌శంక‌ర్ అధ్య‌క్ష‌త వ‌హించారు. భార‌త్‌, మాల్దీవుల మ‌ధ్య గ‌ల ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్థాయి స‌మీక్ష‌కు ఈ స‌మావేశం అవ‌కాశం క‌ల్పించింది. మాల్దీవుల‌లో సోలిహ్ ప్ర‌భుత్వం ఏర్పడిన త‌రువాతి సంవ‌త్స‌ర‌కాలంలో - ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాల‌ను మ‌రింత‌గా పెంపొందించుకునేందుకు - అక్క‌డి ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ దోహ‌ద‌ప‌డింది. అభివృద్ధి స‌హాయం అందించ‌టం ద్వారా మాల్దీవుల‌లో సామాజిక అభివృద్ధితో పాటూ, స‌ముద్ర యానం, భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ రంగాల్లో స‌హ‌కారాన్ని పెంపొందించుకునేందుకు ఇరుదేశాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. మాల్దీవుల్లో అధ్య‌క్ష ఎన్నిక‌ల అనంత‌రం భార‌త్ 1.4 బిలియ‌న్ల అమెరిక‌న్ డాల‌ర్ల ఆర్థిక ప్యాకేజిని ఆ దేశానికి ప్ర‌క‌టించింది. దీనితోపాటు, 5.6 మిలియ‌న్ల డాల‌ర్ల రుణ విత‌ర‌ణ‌, సామాజిక అభివృద్ధి ప్రాజెక్టుల‌కు 800 మిలియ‌న్ల డాల‌ర్లు, కీల‌క మౌలిక వ‌స‌తి ప్రాజెక్టుల‌కు ప్ర‌క‌టించారు. ఈ స‌హాయ ప్రాజెక్టులు మాల్దీవుల‌లోని వివిధ ద్వీపాల అభివృద...

పార్లమెంటులో ఈ వారం

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పౌరసత్వ సవరణ బిల్లు 2019 ఆమోదం ప్రధానమైనది. ఉభయ సభలు బుధవారం నాడు బిల్లును ఆమోదించాయి. పొరుగుదేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘని స్థాన్ లలోని మైనారిటీలు అనుభవిస్తున్న కష్టాలను పరిష్కరించటం చారిత్రక అవసరమని ఈ బిల్లును ప్రవేశపెడుతూ హోంమంత్రి అమిత్ షా అన్నారు. మతపరమైన విభజన తరువాత ఆ దేశాలలోని మైనారిటీలు అనునిత్యం హింసకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ల నుంచి అక్రమంగా వలస వచ్చిన హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు క్రైస్తవుల కు భారత పౌరసత్వానికి అర్హత కలుగ జేయడా నికి 1955 నాటి పౌరసత్వ చట్టాన్ని సవరించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లుకు షరతులకు అనుగుణంగా వర్గీకరణ ఉందని, బిల్లు రాజ్యాంగబద్ధతపై స్పందిస్తూ షా అన్నారు. గత ఐదేళ్లలో ఆ దేశాలకు చెందిన 566 మంది ముస్లింలకు పౌరసత్వం ఇవ్వడానికి భారత్ శ్రద్ధ చూపిందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఆరోపించినట్లుగా సమస్యల నుండి మళ్లించడానికి ఈ బిల్లును తొందరపడి ప్రవేశ పెట్టలేదని అన్నారు. శ్రీలంక, ఉగాండా ప్రజలకు ఇంతకు ముందు పౌరసత్వం కల్పించినట్లు ఆయన చెప్పారు. దేశ కరుణ స...

బ్రిటన్ ఎన్నికలు బ్రెగ్జిట్ కి మార్గాన్ని సుగమం చేస్తాయా ?

2016 జూన్ 23 నాటి ప్రజాభిప్రాయ సేకరణ దరిమిలా యూరోపియన్ యూనియన్ వదిలి వెళ్లే నిర్ణయం - బ్రెక్సిట్ కు అంకురార్పణ జరిగింది. ఫలితంగా ఇద్దరు ప్రధాన మంత్రులు డేవిడ్ కేమెరాన్ ,థెరిస్సా మే లు తమ పదవుల నుంచి వైదొలగాల్సి వచ్చింది. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు మరింత ఆర్థిక అనిశ్చి తితో బ్రిటన్ ఎగుడుదిగుళ్లను ఎదుర్కొనాల్సి వచ్చింది. బ్రెగ్జిట్ కోసం యూరోపియన్ యూనియ న్ తో చర్చలు జరిపిన ఒప్పందాన్ని పార్లమెంటు ఆమోదించడానికి థెరిసా మే అనేక పర్యాయాలు చేసిన ప్రయత్నాలను ఆమె పార్టీ సభ్యులు ఆమోదించలేదు. ఫలితంగా ఆమె పదవి నుండి వైదొలగారు . 2019 జూలైలో బోరిస్ జాన్సన్ పార్టీకి కొత్త నాయకుడిగా ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే 2019 అక్టోబర్ 31 నాటికి బ్రిటిష్ పార్లమెంటు నుండి నిష్క్రమణను పొందే ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు. 2020 జనవరి వరకు మూడు నెలల పాటు బ్రెజిల్ నుండి పొడిగింపు లభించింది. అయినా బ్రిటిష్ పార్లమెంటులో అసహనాన్ని ఎదుర్కొంటున్న బోరిస్ జాన్సన్ 2019 అక్టోబర్ 24 న ఎన్నికలు ప్రకటించారు. యూరోపియన్ ఆర్థిక సమాజం EEC లో బ్రిటన్ ప్రవేశం కూడా నాటకీయంగ...

హాఫిజ్ సయీద్ పై నేరారోపణలు నిజమా...? నాటకమా?

ఐక్య రాజయ సమితి ఉగ్రవాదిగా ప్రకటించిన, జమాత్-ఉద్-దావా - JuD – అధ్యక్షుడు, 26/11 ముంబై దాడుల సూత్రధారి, హాఫిజ్ సయీద్ పై లాహోర్ కోర్టు, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నారనే ఆరోపణలపై అభియోగాలను నమోదు చేసింది. పంజాబ్ పోలీసు కౌంటర్ టెర్రరిజం డిపార్టుమెంటు –CTD- జులైలో సయీద్ ఆయన అనుచరులపై మొత్తం 23 FIRలను నమోదు చేసింది. ఆ అందరిని జ్యుడిసియల్ రిమాండ్’ పై కోట్ లఖ్పాట్ జైలుకు పంపింది. న్యాయమూర్తి ఈ తీర్పును చదివిన సమయంలో సయీద్ కోర్టులోనే ఉన్నారని వార్తలొచ్చాయి. పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక న్యాయ స్థానం సయీద్’పై అభియోగాలు నమోదు చేసేందుకు డిసెంబర్ 11 తేదీని ఖరారు చేసింది. అయితే, ఇప్పడు, ఇదే తేదీ ఎందుకు? అనేది ప్రశ్న. అలాగే కోర్టు ఆయనపై కేసును సీరియస్’గా విచారిస్తుందా? అనే ప్రశ్నలు అంతటా వినిపిస్తున్నాయి.ముఖ్యంగా పాకిస్థాన్’లో వ్యవస్థల పని తీరు తెలిసిన ప్రతి ఒక్కరూ .. ఇదే ప్రశ్న వేస్తున్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్న వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్’పై అంతర్జాతీయంగా వత్తిడి పెరుగుతోంది. గ్లోబల్ యాంటి టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్, Financial Action Task Force – FATF-...

తాలిబాన్ – అమెరికా చర్చలు జగరిగినా... 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, బాగ్రాం ఎయిర్ బేస్ సందర్శన సందర్భంగా, తాలిబాన్లతో శాంతి చర్చలు పునరుద్ధరిస్తామని ప్రకటించారు. అయితే, ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే, బుధవారం, అదే ఎయిర్ బేస్ వెలపల గల వైద్య కేంద్రంపై తాలిబాన్ మానవ బాంబు దాడికి పాల్పడింది. గతంలో, కాబూల్ లోని నాటో’ సైనిక స్థావరంపై తాలిబాన్ దాడి చేయడంతోనే, అప్పటికే ఖరారైన చర్చలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చుక్క పెట్టారు. తాలిబాన్ రాజకీయ బృందం అమెరికా ప్రయాణానికి సర్వం సిద్దం చేసుకున్నప్పటికీ, ట్రంప్ చర్చలు నిలుపు చేశారు. సెప్టెంబర్’ లో చర్చలకు అవరోధం ఏర్పడిన నాటి నుంచి, తాలిబాన్ పదే పదే తాము చర్చలకు సిద్దమని ప్రకటిస్తూనే ఉంది. ఒకసారి కాల్పుల విరమణ నియమ నిబంధనలు ఖరారు అయితే, ఆపైన యుద్ద విరామం ప్రక్రియ మొదలవుతుందని తాలిబాన్ నాయకత్వం పేర్కొంటోంది. చర్చలకు తాత్కాలికంగా బ్రేక్ పడిన నేపధ్యంలో తాలిబాన్ నాయకులు బీజింగ్, మాస్కో, ఇస్లామాబాద్’లలో పర్యటించి ఇదే విషయాన్ని ఆయా దేశాల నాయకులకు వివరించారు. చర్చల పునరుద్ధరణకు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను ఇచ్చారు.  ఈ నేపధ్యంలో చర్చలలో జాప్యం చోటు చేసుకున్నా, అమెర...

పొరుగు దేశాల అల్పసంఖ్యాక శరణార్ధులకు పౌరసత్వం కలిపించడమే ‘ పౌరసత్వ చట్ట సవరణ బిల్లు’ లక్ష్యం

దేశంలో నిర్లక్ష్యానికి గురమవుతున్న పొరుగు దేశాల శరణార్ధులకు పౌరసత్వ హక్కులను కల్పించే లక్ష్యంతో  రూపొందించిన పౌరసత్వ సవరణ బిల్లు - క్యాబ్- ను  భారత ప్రభుత్వం పార్లమెంట్’ లో ప్రవేశ పెట్టింది. విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. లోక్ సభలో బిల్లు భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. అయితే, పొరుగు దేశం పాకిస్థాన్, బిల్లుకు వ్యతిరేకంగా నోరు పారేసుకుంది. నిజానికి, తమ దేశంలో మైనారిటీలను నామరూపాలు లేకుండా తుడిచేసిన పాక్’ కు భారత దేశంలోని మైనారిటీల గురించి మాట్లాడే, నైతిక హక్కు లేదు. దేశ విభజన సమయంలో పాక్’ జనాభాలో 23.5 శాతం ఉన్న, మైనారిటీలు, తరిగి తరిగి చివరకు 3.5 శాతానికి చేరుకున్నారు.  ఉభయ దేశాలలో మైనారిటీల రక్షణకు నెహ్రూ – లియాకత్’ ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని, పాకిస్థాన్ ఏ నాడూ పట్టించుకోలేదు. ఫలితంగా పాక్’ లో క్రమంగా మైనారిటీల సంఖ్య తగ్గిపోయింది. వివిధ మతాలకు చెందిన మైనారిటీలు దేశం వదిలి భారత దేశం చేరుకున్నారు. బంగ్లాదేశ్’ జనాభాలో 1971 నాటికి, 21.3 శాతం ఉన్న మైనారిటీల జనాభా, ఇప్పుడు కేవలం 8.5 శాతానికి పడిపోయింది. మరో వంక, భారత దేశంలో దేశ విభజన నాటికి జనాభాలో 9.8 శాతం మాత్రమే ఉన్న ...

కొనసాగుతున్న భారత్ వృద్ధి – OECD ఆర్థిక సర్వే వెల్లడి

భారత ఆర్థిక సర్వేపై ఆర్థిక సహకారం – అభివృద్ధి సంస్థ (OECD) గతవారం న్యూఢిల్లీలో విడుదల చేసిన నివేదికలో భారత్ వృద్ధిరేటు దృఢంగా, సుస్థిర పథంలో కొనసాగుతుందని చెప్పింది. అయితే ప్రైవేటు కార్పొరేటు పెట్టుబడులు, పారిశ్రామిక ఉత్పత్తులు వెనుకబడి వున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. భారత దేశ వృద్ధి కథ ప్రధానంగా వినియోగం ద్వారా నడుస్తుంది. పన్నుల సరళీకరణ, వ్యాపార సౌలభ్య బలోపేతం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడుల పెంపుదలకు సంస్కరణల అనంతరం వేగం కోల్పోయిన వృద్ధి క్రమంగా పుంజుకుంటుందని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. కానీ మంచి నాణ్యత గల ఉద్యోగాల కల్పనలో గ్రామీణ ఆదాయంలో స్తబ్ధత కీలకమైన సవాళ్ళుగానే మిగిలిపోయాయి. దేశంలోని రాష్ట్రాలలో ఆర్థిక సారూప్యత కొరవడటం అంటే పేద రాష్ట్రాలు ధనిక రాష్ట్రాల వడిని అందుకోలేకపోవటం అనే అంశంపై తక్షణ శ్రద్ధ చూపాలి. దేశంలో అంతర్గతంగా వున్న అసమానతలు విస్తృతమవకుండా తుంచివేయాలి. నివేదిక విడుదల చేసిన సందర్భంగా OECD అధిపతి, ఆర్థికవేత్త లారెన్స్ బూనె మాట్లాడుతూ – ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ యిప్పుడు వృద్ధిలో ఛాంపియన్ గా బాగా స్థిరపడిందని అన్నారు. ఆర్థిక వృద్ధి కోలుకోవాలంటే నింతరమైన సంస...