Posts

Showing posts from February, 2020

భార‌త‌-న్యూజిలాండ్ సంబంధాలు: ఇండో-ప‌సిఫిక్ ప్రాంతీయ ఏకీక‌ర‌ణ‌కు ప్రోత్సాహం

భార‌త‌-న్యూజిలాండ్ స్నేహ‌సంబంధాల విష‌యంలో 2020 సంవ‌త్స‌రం ఆశావహంగా మొద‌లైంది. ముఖ్యంగా న్యూజిలాండ్ వ‌ల‌స వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ఇయాన్ లీస్‌-గాలోవే గ‌త‌నెల ముంబై సంద‌ర్శించి వెళ్లాక ఈ అంశం ప్ర‌స్ఫుట‌మైంది. ఆ త‌ర్వాత ఫిబ్ర‌వ‌రిలో న్యూజిలాండ్ ఉప ప్ర‌ధాని-విదేశాంగ శాఖ మంత్రి విన్‌స్ట‌న్ పీట‌ర్స్‌, వాణిజ్య‌శాఖ మంత్రి డేవిడ్ పార్క‌ర్‌లతోపాటు వాణిజ్య ప్ర‌తినిధి బృందం భార‌త్‌లో ప‌ర్య‌టించ‌డం మ‌రింత ప్రాముఖ్యం సంత‌రించుకుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లతో రెండు దేశాల మ‌ధ్య‌ సంబంధాల్లో ఏకీక‌ర‌ణ‌కు అవ‌కాశంగల కొన్ని ముఖ్య‌మైన రంగాల్లో స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారానికి వీలుంటుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. భార‌త‌-న్యూజిలాండ్ న‌డుమ చారిత్ర‌కంగా అనేక పోలిక‌లున్నాయి... రెండు దేశాల్లోనూ బ్రిటిష్ వ‌ల‌సపాల‌న వార‌సత్వం క‌నిపిస్తుంది. అలాగే పార్ల‌మెంట‌రీ పాల‌న విధానం ప‌రిణామం చెందింది. అంతేకాకుండా కామ‌న్‌వెల్త్ కూట‌మిలో ఉమ్మ‌డి అనుబంధం కూడా కొన‌సాగుతోంది. వీట‌న్నిటి మాట అటుంచి- ప‌ర‌స్ప‌ర ఏకీక‌ర‌ణ‌, ఆసక్తిగ‌ల రంగాల‌ను గుర్తించేందుకు ద్వైపాక్షికంగానేగాక ఇండో-ప‌సిఫిక్ విస్తృత ప్ర‌యోజ‌నాల దృష్ట్యా సునిశిత‌, ప్ర‌త్యేక ప‌థాన్ని రూ...

పశ్చిమాసియా నాలుగో మహాసభ

భార‌త ప్రధాన మేధోమథన నిలయమైన “మనోహర్‌ పరికర్‌ రక్షణాధ్యయన-విశ్లేషణ సంస్థ” న్యూఢిల్లీలో ‘పశ్చిమాసియా నాలుగో మహాసభ’ను నిర్వహించింది. “పశ్చిమాసియాలో పదేళ్ల రాజకీయ-ఆర్థిక పరివర్తన: సవాళ్లు... పాఠాలు... భవిష్యత్‌ ధోరణులు” ఇతివృత్తంగా సాగిన మహాసభలో అనేక ముఖ్యమైన అంశాలపై ప్రముఖులు చర్చించారు. లెబనాన్‌ మాజీ ప్రధానమంత్రి ఫువాద్‌ సిన్యూరా, ఈజిప్టు విదేశాంగ శాఖ మాజీ మంత్రి నబీల్‌ ఫ్యామీసహా జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పలువురు ఇందులో పాల్గొన్నారు. రెండు రోజులపాటు ఆరు విడతలుగా నిర్వహించిన చర్చాగోష్ఠిలో- ప్రాంతీయ భద్రత నేపథ్యం, బాహ్యశక్తుల పాత్ర, ఆర్థిక వ్యవస్థ, వైరుధ్య స్వభావంలో మార్పులు-పశ్చిమాసియాతో పెరుగుతున్న భారత మైత్రివంటి అంశాలు చర్చకు వచ్చాయి. భారత్‌ తరఫున పాల్గొన్న కేంద్ర రోడ్డురవాణా-జాతీయ రహదారులశాఖ సహాయ మంత్రి, రిటైర్డ్‌ జనరల్‌ విజయకుమార్‌ కీలకోపన్యాసం చేశారు. గడచిన దశాబ్దంగా పశ్చిమాసియాలో తలెత్తిన ఉపద్రవాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఈ ప్రాంతానికి భారత్‌ అత్యంత ప్రాముఖ్యం ఇస్తున్నదని వివరించారు. మరోవైపు నిత్య అనిశ్చితి ఫలితంగా ఈ ప్రాంత ఆర్థిక ప్రగతి తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నదన...

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం

భార‌త్‌-అమెరికాల స‌మ‌గ్ర అంత‌ర్జాతీయ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం బ‌లోపేతానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్ర‌తిన‌బూనారు. సార్వ‌భౌమ‌, స‌చేత‌న ప్ర‌జాస్వామ్య దేశాల అధినేత‌లుగా పౌరులంద‌రికీ స్వేచ్ఛ‌, స‌మాన ఆద‌ర‌ణ‌, మాన‌వ హ‌క్కులు, చ‌ట్ట నిబ‌ద్ధ‌త త‌దిత‌రాల‌కుగ‌ల ప్రాముఖ్యాన్ని వారిద్దరూ చ‌క్క‌గా గుర్తించారు. ఆ మేర‌కు రెండుదేశాల పౌరుల దృఢ‌మైన భాగ‌స్వామ్యం, ప‌ర‌స్ప‌ర విశ్వాసం, ఉమ్మ‌డి ప్ర‌యోజ‌నాలు, సౌహార్ద‌త‌ల‌తో ముడిప‌డిన ఒడంబ‌డిక‌కు ఆమోదం తెలిపారు. రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోవడంపై ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ కృతనిశ్చయానికి వచ్చారు. ప్రత్యేకించి సముద్ర, అంతరిక్ష రంగాల్లో మరింత అవగాహన, సమాచార భాగస్వామ్యం అవసరమని నిర్ణయించారు. అలాగే సంయుక్త సహకారం, సైనిక అనుసంధాన సిబ్బంది ఆదానప్రదానం, అన్నిరకాల బలగాల, ప్రత్యేక దళాల మధ్య అత్యాధునిక శిక్షణసహా సైనిక విన్యాసాల విస్తరణపైనా దృష్టి నిలిపారు. దీంతోపాటు ఆధునిక రక్షణరంగ విడిభాగాలు, పరికరాలు, వేదికలకు సంబంధించి సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తిపై సన్నిహిత సహకారం; రెండుదేశాల్లోని రక్షణరంగ పరిశ్ర...

అమెరికా అధ్యక్షుడి పర్యటనతో ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊపు

అమెరికా అధ్యక్షుడి పర్యటనతో ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊపు భారతదేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 36 గంటల అధికార పర్యటన ఆడంబరంగానేగాక అర్థవంతంగానూ సాగింది. భారత సందర్శనకు వచ్చిన అమెరికా అధ్యక్షులలో ఆయన ఏడో వారు కాగా; రెండు దశాబ్దాల వ్యవధిలో నలుగురు అధ్యక్షులు భారత్‌లో పర్యటించడం విశేషం. భారత-అమెరికా సంబంధాల ఊర్ధ్వముఖ పయనానికి ఇదొక సూచిక. అధ్యక్షుడి వెంట వచ్చిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంలో ఆయన సతీమణి-ప్రథమ మహిళ మెలానియా సహా వారి కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ కూడా ఉన్నారు. అహ్మదాబాద్‌లో అడుగుపెట్టిన అధ్యక్షుడు ట్రంప్‌కు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు స్వాగతం పలికారు. అటుపైన సబర్మతి ఆశ్రమం సందర్శించిన ట్రంప్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొతెరా స్టేడియంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో లక్షా 25వేల మందికిపైగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఐదు నెలల కిందట హ్యూస్టన్‌లో నిర్వహించిన ‘హౌడీ మోడీ’ సభలో భారీగా హాజరైన భారత-అమెరికన్లను ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ ప్రసంగించడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఇక అహ్మదాబాద్‌ సభలో ప్...

అధ్యక్షుడు ట్రంప్‌ తొలి భారత పర్యటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అహ్మదాబాద్‌లో పాదం మోపడంద్వారా తన తొలి భారత పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలికారు. దేశాధినేతలిద్దరి మధ్యగల వ్యక్తిగత సాన్నిహిత్యానికి ఈ స్వాగత సత్కారం అద్దంపట్టింది. అనంతరం మహాత్ముని జన్మభూమి గుజరాత్‌లో ఆ మహనీయుడు నివసించిన సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్‌ సందర్శించారు. బ్రిటిష్‌ పాలన నుంచి భారత దాస్యవిముక్తిలో జాతిపిత పోషించిన పాత్ర దృష్ట్యా ట్రంప్‌ సందర్శనకు ప్రాముఖ్యం ఏర్పడింది. అహ్మదాబాద్‌లోని మొతేరాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంను ప్రారంభించాలని కోరడంద్వారా ట్రంప్‌ను భారత్‌ సాదరంగా స్వాగతించింది. అందునా దేశం నలుమూలల నుంచి హాజరైన లక్షకుపైగా జనసమూహం సమక్షంలో ఆయనకు ఈ అరుదైన గౌరవం లభించింది. అటుపైన దేశంలోని వివిధ రాష్ట్రాల కళాకారులు తమ సంగీత-నృత్య నైపుణ్యంతో కొన్ని గంటలపాటు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అమెరికా అధ్యక్షుడికి చవిచూపారు. భారతీయతలోని వైవిధ్యం, భారతీయ సమాజంలోని బహుళ సంస్కృతీ సౌందర్యాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ తిలకించి పులకించారు. అనంతరం మొతేరా స్టేడియంలో...

FATF నిషేధిత జాబితాలోనే ఇరాన్‌... నిఘా జాబితాలో పాకిస్థాన్‌

ఇరాన్‌ను ‘నిషేధిత జాబితా’లో కొనసాగించాలని అంతర్జాతీయ ఆర్థిక కార్యాచరణ సంస్థ- FATF గత శుక్రవారం నిర్ణయించింది. మరోవైపు పాకిస్థాన్‌ను మాత్రం ‘నిఘా జాబితా’లోనే ఉంచింది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి నిధుల నిరోధంద్వారా ప్రపంచాన్ని మరింత సురక్షితంగా ఉంచేందుకు 40 సభ్యదేశాలతో కూడిన ఈ సంస్థ పారిస్‌ కేంద్రంగా కృషి చేస్తూంటుంది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా అక్రమ ద్రవ్య చలామణీ, ఉగ్రవాదానికి నిధుల ప్రవాహంపై నిఘా పెడుతూ, రెండు విభిన్న విభాగాల్లో సంబంధిత దేశాల జాబితాను రూపొందిస్తుంది. ఆయా దేశాలతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించే అంతర్జాతీయ సమాజానికి ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచుతుంది. ఈ క్రమంలో FATF ఏదైనా దేశాన్ని నిషేధిత జాబితాలో చేర్చిందంటే- ఆ దేశంతో ఆర్థిక లావాదేవీలు అత్యంత ప్రమాదకరమని అర్థం. అలాగే ‘నిఘా జాబితా’లోని దేశం అక్రమ ద్రవ్య చలామణీ, ఉగ్రవాదానికి నిధులపై చర్యలు తీసుకుంటున్నా ఇంకా చాలా చేయాల్సి ఉందని, అయినప్పటికీ దానితో వ్యవహారాలవల్ల పెద్దగా ముప్పులేదని అర్థం. ఇరాన్‌లో పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహించిన రోజునే ఆ దేశాన్ని ‘నిషేధిత జాబితా’లోనే కొనసాగిస్తున్నట్లు FATF ప్రకటించడం యాదృచ్ఛికం. కాగా, ఇరాన్‌...

నిషేధం కాదు... నిఘా: పాకిస్థాన్‌కు FATF మరో అవకాశం

అంతర్జాతీయ ఆర్థిక కార్యాచరణ సంస్థ-FATF సర్వసభ్య సమావేశం గత ఆదివారం పారిస్‌లో జరిగింది. ప్రపంచంలోని 205 దేశాలనుంచి 800 మందికిపైగా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా FATF నిఘా జాబితానుంచి పాక్‌ బయటపడే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇతర అంశాలతోపాటు అక్రమ ద్రవ్య చలామణీసహా ఉగ్రవాదానికి నిధుల నిరోధంపై పాకిస్థాన్‌, మరికొన్ని దేశాలు ఇచ్చిన హామీల ప్రగతిపై సమీక్షకు FATF నిర్ణయించింది. కాగా, ఈ రెండు విషయాల్లో అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థకు ముప్పు తేగలవని భావించే దేశాలను FATF నిఘా జాబితాలో చేరుస్తుంది. ఆ మేరకు 2018 జూన్‌ నుంచీ ఈ జాబితాలో ఉన్న పాకిస్థాన్‌, దాన్నుంచి బయటపడబోదని, ఈ ఏడాది జూన్‌ వరకూ కొనసాగుతుందని 2020 ఫిబ్రవరి 19నుంచి వార్తలు వెలువడ్డాయి. అంతకుముందు... అంటే- తన హామీలకు కట్టుబాటుపై ఫిబ్రవరి 17న పాక్‌ సమర్పిత నివేదికను పరిశీలించిన అంతర్జాతీయ సహకార సమీక్ష కూటమి-ICRG ఆ దేశం తీసుకున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తంచేసింది. అందువల్ల FATF నిఘా జాబితానుంచి పాక్‌ బయటపడే అవకాశం లేదన్న అంచనాలు వెలువడటంలో ఆశ్చర్యమేమీ లేదు. మరోవైపు ఉగ్రవాద నిరోధంపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రప...

ఆఫ్ఘన్‌ అధ్యక్ష ఎన్నికల్లో అష్రఫ్‌ ఘనీ విజయం

ఆఫ్ఘనిస్థాన్‌లో 2019 సెప్టెంబరు 28న హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు 5 నెలల తర్వాత ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరి 18న వెల్లడయ్యాయి. ఆ మేరకు ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ విజేతగా నిలిచారు. కానీ, ఆయన ప్రధాన ప్రత్యర్థి అబ్దుల్లా అబ్దుల్లా ఈ ఫలితాలను తిరస్కరించారు. ఎన్నికల సంఘం మోసపూరితంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ- తదుపరి ప్రభుత్వాన్ని తానే ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. పోలింగ్‌ సందర్భంగా ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపని నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రాథమిక దశలో ఘనీ ముందంజలో నిలిచినపుడు ఓటింగ్‌ శాతంపై ప్రత్యర్థులతో వివాదం తలెత్తింది. దీంతో 15 శాతం ఓట్లపై తనిఖీ చేయాలని నిర్ణయించారు. మొత్తంమీద 50.64 ఓట్లు పొందిన అధ్యక్షుడు ఘనీ స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కారు. ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత అష్రఫ్‌ ఘనీ మళ్లీ ఎన్నిక కావడంపై భారత్‌ అభినందనలు తెలిపింది. ప్రజాస్వామ్యంవైపు పయనించాలన్న ఆఫ్ఘనిస్థాన్‌ ప్రజల ఆకాంక్షకు తన మద్దతును పునరుద్ఘాటించింది. వెలుపలి శక్తుల ఊతంతో చెలరేగుతున్న ఉగ్రవాదంపై పోరాటంతోపాటు సార్వజనీన, శాశ్వత అంతర్గత శాంతి-సామరస్యాల కోసం “ఆఫ్ఘన్‌ చోదిత, ఆఫ్ఘన్‌ సొంత, ఆఫ్ఘన్‌ నియంత్రిత” ప్ర...

భారత్ జర్మనీల బహు ముఖ భాగస్వామ్యం

మ్యూనిక్ భద్రతా సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి డా. యస్.జయశంకర్ జర్మనీ ని సందర్శించారు.ఈ పర్యటన సందర్భంగా ఆయన Oman, Spain, Kuwait, Armenia, Saudi Arabia, Australia ల విదేశాంగ మంత్రులతో ముఖాముఖి నిర్వహించారు. అలాగే Singapore, Germany, Belgium ల రక్షణ మంత్రులతోనూ సమావేశమయ్యారు.European Council అధ్యక్షునితోనూ ఆయన సమావేశమయ్యారు. Berlin చేరుకున్న డా.జయ శంకర్ Germany విదేశాంగ మంత్రి Heiko Mass,Germany రక్షణ మంత్రి Ms.Annegrete Kramp Karrenbauer లతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు,ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ పరస్పరాసక్తి గల విషయాలపై వివరంగా చర్చలు జరిపి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్,జర్మనీలు పటిష్టమైన ద్వైపాక్షిక సంబంధాలు, అతి చక్కని సహకార భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఈ సంప్రదాయానికి కొనసా గుంపుగా Franco - German ప్రోత్సహిత బహుళ పాక్షికత కూటమిలో భారత్ గణనీయంగా చేరింది. ఈ విషయాన్ని డా.జయశంకర్ ప్రకటిస్తూ నేడు multilaterism కు జాతీయత,వర్తకవాదాల నుండి ఒత్తిడి ఉందని గమనించారు.ఐక్యరాజ్యసమితి centrality ని, అంతర్జాతీయ వాణిజ్యం లో WTO ఔచిత్యాన్ని భారత్ విశ్వసి...

టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్

టర్కీఅధ్యక్షుడు Recep Tayyip Erdogan ఇటీవల జరిపిన పాకిస్తాన్ పర్యటన సందర్భంగా కాశ్మీర్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తబరిచారు.ఇటీవల తీసుకున్న చర్యల దరిమిలా అక్కడి పరిస్థితి సంక్షోభకరంగా మారింది అన్నారు. కాశ్మీరీల అంచనాల మేరకు,ఐక్యరాజ్య సమితి తీర్మానాల మేరకు ,భారత్ పాకిస్తాన్ లు చర్చల ద్వారా కాశ్మీర్ సమస్య పరిష్కారం కావాలన్నది టర్కీ అభిప్రాయం. కాశ్మీర్ తో టర్కీ సంఘీభావాన్ని ఆయన వ్యక్త పరిచారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో విదేశీ అధిపత్యానికి వ్యతిరేకంగా సలిపిన టర్కీ పోరాటం తో ఆయన పోల్చారు టర్కీ అధ్యక్షుని అభిప్రాయం పై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ దేశ రాయబారికి ఈ మేరకు ఒక demarche ని జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలు చరిత్ర పై ఆయన అవగాహనరాహిత్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని, దౌత్య ప్రవర్తనకు భిన్నంగా ఉందని, టర్కీ భారత్ సంబంధాలను అవి తీవ్రంగా ప్రభావితం చేస్తాయని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన లో తెలియజేసింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో టర్కీ జోక్యానికి ఈ తాజా ఉదంతం మరో ఉదాహరణ అని ఆ ప్రకటన లో పేర్కొన్నారు. భారత్ దీన్ని సంపూర్ణంగా ఆమోదయోగ్యం కానిదిగా భావిస్తోంది. పాకిస్తాన్ బేఖాతరుగా పాల...

ప్రాముఖ్యతను సంతరించుకున్న భారత్ యూరోపియన్ యూనియన్ వ్యూహాత్మక భాగస్వామ్యం

యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాల మండలితో చర్చలకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రసెల్స్ సందర్శించారు. యూరోపియన్ యూనియన్ high representative/ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధాన వైస్ ప్రెసిడెంట్ Mr.Joseph Borrel Fontelles ఆహ్వానం మేరకు ఈ సందర్శన చోటుచేసుకుంది. 2019 డిసెంబర్లో నూతన కమిషన్ అధికార బాధ్యతలు చేపట్టిన దరిమిలా, యూరోపియన్ యూనియన్ కి తొలిసారి జరిపిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి పర్యటన ఇది. యూరోపియన్ యూనియన్ హై రిప్రజంటేటివ్, ఇరవై ఏడు సభ్య దేశాల వ్యవహార మంత్రులు ఈ విదేశీ వ్యవహారాల మండలి - FAC ని రూపొందించారు. విదేశాంగ విధానం, రక్షణ, భద్రత, వాణిజ్యం, అభివృద్ధి సహకారం, మానవతా సాయం వంటి అంశాల పై వెలుపలి చర్యలకు ఈ మండలి బాధ్యత వహిస్తుంది. భారత విదేశీ విధాన ప్రాధాన్యాలు, ప్రాంతీయ, భౌగోళిక అవగాహనపై FAC తో డాక్టర్ జయశంకర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్యాలైన భారత్,European Union ల ఉమ్మడి విలువలపై ప్రధానంగా చర్చల్లో దృష్టి నిలిపారు. ప్రజాస్వామ్యం, బహుళ పాక్షిిికత, నియమ ఆధారిత order, నియమాల ప్రాతిపదికన WTO తో అంతర్జాతీయ వ్యాపారం, సుస్థిర...

మ్యూనిచ్ భద్రతా సమావేశం  2020కీలకాంశాలు 

జర్మనీ మ్యూనిచ్ లో గత వారం యాభై ఆరవ మ్యూనిచ్ భద్రతా సమావేశం జరిగింది .పశ్చిమ దేశాలలో విలువల, వ్యూహాత్మక ధోరణుల్లో విభేదాలు, అనిశ్చితుల వలన ఉద్భవించిన పాశ్చాత్య రాహిత్యం అనే భావన పై ఈ సమావేశం దృష్టి నిలిచింది. భౌగోళిక సమస్యల నుంచి, మిత్ర దేశాల నుంచి వాషింగ్టన్ తమను వేరు చేసుకుందని ఈ సమావేశంలో నాటో సెక్రటరీ జనరల్ Jens Stoltenberg పేర్కొన్నారు. అయితే యూరోపియన్ మనోభావాలకు ఆసరా ఇస్తూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అట్లాంటిక్ కూటమి అంత్యదశకు చేరుకోవడాన్ని ముఖ్యంగా ప్రస్తావించారు. పాశ్చాత్యం, ఆయన ప్రకారం గెలుపొందుతున్న దని, వాస్తవానికి కలిసి గెలుపు పొందుతోందని అన్నారు. నాటో ద్వారా యూరోపియన్ సరిహద్దుల పరిరక్షణకు వాషింగ్టన్ ప్రధాన భూమిక పోషిస్తోందని, అలాగే ఇస్లామిక్ స్టేట్ ని ఓడించేందుకు బహుళ జాతీయ ప్రయత్నానికి నాయకత్వం వహిస్తోందన్నారు. అంతర్జాతీయ సమాజం అన్న అభిప్రాయాన్ని అమెరికా తిరస్కరించిందని జర్మన్ అధ్యక్షుడు Frank Walter Steinmeier అనడమే కాక పొరుగు దేశాల,భాగస్వాముల పణంగా వ్యవహరిస్తోందని అన్నారు.ఫ్రెంచ్ అధ్యక్షుడుE mmanuel Macron కూడా పాశ్చాత్యం బలహీన పడుతున్నదనే హెచ్చరించారు. ...

ఇండియా – పోర్చుగల  సంబంధాలో నూతన అధ్యాయం 

పోర్చుగీసు అధ్యక్షడు మార్సెలో రెబెలో డే సౌసా భారత దేశంలో పర్యటించారు. విజయవంతమైన ఈ పర్యటనలో ప్రత్యేకంగా పేర్కొనవలసిన విషయం, విశేషం, ఉభయ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు.ఈ పర్యటనలో అనేక విషయాలకు సంబంధించి పరస్పర ప్రయోజనకరమైన 14 అవగాహనా ఒప్పందాలు, MoUలపై ఉభయ దేశాలు సంతకాలు చేశాయి.ఇందులో సముద్ర రవాణా, నౌకా కేంద్రాల అభివృద్ధి, అంకుర పరిశ్రమలు, అంతరిక్ష పరిశోధనలు, దౌత్య శిక్షణ, శాస్త్ర పరిశోధనలు, ప్రజా సంబంధ విషయాలు వంటి అనేక అంశాలు ఉన్నాయి. పోర్చుగల అధ్యక్షుని భారత పర్యటన ఉభయ దేశాల సంబంధాలలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. గడచిన మూడు సంవత్సరాలలో ఉభయ దేశాల సంబంధాలలో చోటు చేసుకున్న మార్పులు నూతన నిర్వచనాన్ని చైతన్యాన్ని, ఆవిష్కరించాయి.ఈ మూడు సంవత్సరాల కాలంలో ఉభయ దేశాల సంబంధాలలో అనేక సానుకూల మార్పులు వేగంగా చోటు చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో భారత్, పోర్చుగల్ దేశాలు రెండూ దౌత్య ప్రయోజనాలు పొందేందుకు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం, నడుస్తున్న చరిత్రలో చోటు చేసుకుంటున్న ప్రపంచ, ద్వైపాక్షిక పరిణామాలు పోర్చుగల్, భారత ప్రయోజనాలను సమ్మిళితం చేస్తున్నాయి. ఒకటిగా కలుపుతున్నాయి. ప్రపంచ పరిణామలు అ...

పార్లమెంట్’లో ఈవారం

రచన:వీ. మోహన్ రావు, జర్నలిస్ట్  విదేశీ పెట్టుబడిదారులు, భారత ఆర్థిక వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం చూపుతున్నారని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్ర బడ్జెట్ 2020-21పై పార్లమెంట్’లో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ, ఆర్థికమంత్రి ‘అభివృద్ధి పెట్టుబడులకు నిధులు సమకూర్చే సాధనసంపత్తి బ్యాంకులకు పుష్కలంగా ఉందని పార్లమెంట్’కి తెలిపారు. 2024-25 నాటికి ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగంలో లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. GST రెవిన్యూ వసూళ్ళలో క్రమానుగతి వృద్ధి కనపడుతోందని మంత్రి చెప్పారు. 2014-15లో రెండు ట్రిలియన్ డాలర్లున్న దేశ నామినల్ GDP, 2019-20 నాటికి 2.9 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని ఆర్థిక మంత్రి వివరించారు.యువత భవిత కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి నిర్మలా సీతారామన్, తెలిపారు.భారత ఆర్థికవ్యవస్థ పట్ల సర్వత్రా సానుకూల విశ్వాసం బలపడుతోందని అంటూ కేంద్ర అర్థిక మంత్రి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వివరించారు. నావెల్ కరోనా వైరస్ ముప్పును ఎ...

మరో మారు పాకిస్థాన్ కపట నాటకం

పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం 2008 ముంబై బాంబు దాడుల సూత్రం దారుడు, పాకిస్థాన్ స్థావరంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న జమాత్ - ఉద్ – దవా ,లష్కర్ –ఈ- తాయబ్ అధ్యక్షుడు, హాఫిజ్ సయీద్’కు 11సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడు అనే రెండు అభియోగాలపై సయీద్’కు న్యాయస్థానం జైలుకు పంపింది.పాకిస్థాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్టుమెంటు (సీటీడీ), సయీద్ ఆయన అనుచరులపై, పంజాబ్ ప్రాంతంలోని విధ పట్టణాలలోని ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తునాడన్న ఆరోపణలపై మొత్తం 23 FIRలు నమోదు చేసింది. “హాఫిజ్ సయీద్ ఆయన సన్నిహిత సహచరుడు జాఫర్ ఇక్బాల్’లను ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్న రెండు కేసులలో శిక్షించడం జరిగింది” అని పాకిస్థాన్ ప్రభుత్వ ప్రాసిక్యూటర్’ అబ్దుల్ రూఫ్ వాట్తో తెలిపారు. “రెండు కేసుల్లో కలిపి మొత్తం శిక్షాకాలం11 సంవత్సరాలు,అయితే, రెండు శిక్షలు ఒకే సారి అమలుతున్నందున, సయీద్ ఐదున్నర సంవత్సరాలు మాత్రమే జైల్లో ఉంటాడు” అని సయీద్ న్యాయవాది ఇమ్రాన్ గిల్ తెలిపారు. అలాగే, “మేము న్యాయస్థానం తీర్పుపై పై కోర్టులో అపీల్ చేస్తాం” అని కూడా న్యాయవాది తెలిపారు....

భారత యాక్ట్ ఈస్ట్ పాలసీకి వియత్నాం వారధి 

సోషలిస్ట్ రిపబ్లిక్ అఫ్ వియత్నాం ఉపరాష్ట్రపతి డాంగ్ థాయ్ న్గోక్ థిన్హ, ఇటీవల భారత దేశంలో పర్యటించారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో ప్రతినిధి స్థాయిలో అధికారిక చర్చలు జరిపారు. తూర్పు దేశాల దౌత్య సంబధాల విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి, అదే విధంగా ఇండో – పసిఫిక్ వ్యుహనికీ కూడా వియత్నాం వారధిగా, సంధానకర్తగా నిలుస్తుంది.అంతే కాదు,ఆగ్నేయ ఆసియా దేశాలతో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను మెరుగు పరచుకునే లక్ష్యంలోభాగంగా, భారత దేశం CLMV దేశాలుగా వ్యవహరించే-కంబోడియాలో పీడీఅర్,మయాన్మార్,వియత్నాం దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలోనూ వియత్నాం,కీలక భూమికను పోషిస్తుంది. భారత్ – వియత్నాం దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా వియత్నాం ఉపరాష్ట్రపతి భారత దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్ – వియత్నాం దేశాల మధ్య నేరుగా విమాన సర్వీస్ ఏర్పాటు చేస్తూ చేసిన ప్రకటన వియత్నాం ఉపరాష్ట్రపతి డాంగ్ థాయ్ న్గోక్’ భారత్ పర్యటనలో ప్రధానంగా చెప్పుకోవలసిన విశేషం. ఇందుకు అదనంగా,ఈ పర్యటనలో వాయిస్ అఫ్ వియత్నాం, రెసిడెంట్ ఆఫీసును డిల్లీలో ఏర్పాటు...

అమరికా అధ్యక్షుడు ట్రంప్భా రత పర్యటన ప్రాముఖ్యత 

ద్వితీయ ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి, అమెరికా అధ్యక్షుడు ఏ దేశంలో పర్యటించినా,ఆ పర్యటనను తక్కువగా అంచనావేయడం కుదరదు.అమెరికా అగ్రరాజ్యం కావం ఒక్కటే అందుకు కారణం కాదు. సంక్లిస్ట ప్రపంచ రాజాకీయ ఆర్థిక వ్యవస్థలో అమెరికా పోషించే పాత్ర చాలా కీలకమైనది.ఒక విధంగా, ప్రపంచ ఆర్థిక రాజకీయ వ్యవహారాల్లో అమెరికా నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుంది. అమెరికా అధ్యక్షుని పర్యటన ఫలితాలపై భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చును, కానీ, అమెరికాతో సంబంధాలు, అమెరికాతో చర్చలను మాత్రం ఎవరూ కాదనరు,వద్దనరు. ఎవరూ సవాలు చేయరు.ఇక త్వరలో భారత దేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జరిపే పర్యటన విషయానికి వస్తే, ఈ పర్యటన ఉభయ దేశాలకు కూడా ఎంతో కీలకం. అందుకు ఎంన్నో కారణాలున్నాయి. ప్రపంచ వ్యూహాత్మక సమతుల్యత చాలా వేగంగా అమెరికా వైపు కదులుతోంది. అగ్ర రాజ్యం వైపు మొగ్గు చూపుతోంది. కొంతకాలం క్రితం వరకు వినవచ్చిన అమెరికా ప్రాబల్యం తగ్గి, చైనా ప్రాబల్యం పెరుగుతోందన్న ముచ్చట ఇప్పడు మరుగున పడిపోయింది. ఆ ప్రచారం ఆగిపోయింది. అధ్యక్షుడు ట్రంప్ చుట్టూ చాలా చాల వివాదాలు చుట్టుకున్నా,ఆయన తమ స్థానాన్నితిరిగి పొందగలిగారు. ప్రపంచంలో అమెరికా ...

భారత ఉప ప్రాంతీయ అనుసంధాన ప్రణాళికకు బీబీఎన్ ఊతం, ఉత్సాహం  

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి – ఎన్డీఎ - ప్రభుత్వ విదేశాంగ విధానంలో , వైబర్హుడ్ ఫస్ట్, పొరుగువారికి ప్రధమ ప్రాధాన్యత, విధానం ఒక ప్రధాన అంగంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పొరుగు దేశాలపై,ముఖ్యంగా భారత దేశానికి తూర్పున ఉన్న పొరుగు దేశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొరుగు దేశాల దౌత్య విధానంలో ప్రత్యేకత ఉంది. పొరుగు దేశాల దౌత్య సంబంధాలలో కేవలం ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను మెరుగు పరచుకోవడం మాత్రమే కాదు, అది అంతవరాకే పరిమితం కాదు.ప్రాంతీయ,ఉప ప్రాంతీయ స్థాయిలో బలమైన మౌలిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దౌత్య విధానంలో భాగంగా నిలిచింది.అంటే, రోడ్డు, రైలు, వాయు మార్గాల అనుసంధానంతో పాటుగా ఆర్థిక అనుసంధానం, ప్రజల మధ్య అనుసంధానం, డిజిటల్ అనుసంధానమ వంటి సున్నిత అనుసంధాన అంశాలు అన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దౌత్య ప్రణాళికలో, దౌత్య విధానంలో భాగంగా ఉన్నాయి. ఇందులో భాగంగా భారత దేశం, పొరుగు దేశాల మధ్య అనేక దృఢ, సున్నిత బంధాలను ప్రోత్సహించే అనుసంధ...

భారత్ – ఆఫ్రికా రక్షణ మంత్రుల సదస్సు

లక్నోలో జరిగిన ‘డిఫెన్సు ఎక్స్పో ఇండియా’ సందర్భంగా, భారత్ – ఆఫ్రికా రక్షణ శాఖ మంత్రుల సదస్సు జరిగింది. భారత్, అఫ్రిక్ దేశాల రక్షణ మంత్రుల మధ్య అధికారికంగా సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడంతో ఈ సదస్సు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.అలాగే,అఫ్రికా దేశాలతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు వేసిన తొలి అడుగు కూడా ఇదే కావడం మరో విశేషం.ఆఫ్రికా దేశాలతో భారత దేశానికి రక్షణ భాగస్వామ్యం ఉంది.ఇప్పడు,ఈ సదస్సు,భారత దేశంలో తయారైన పరికరాలను ఆఫ్రికా ఖండానికి ఎగుమతి చేసే వేదికను ఏర్పాటు చేసింది. 14 ఆఫ్రికా దేశాల రక్షణ మంత్రులు, పార్లమెంట్ సంభ్యులు, 19 మంది సైన్యాధికారులు, ఎనిమిది మంది శాశ్విత కార్యదర్శులు సహా మొత్తం 154 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. రక్షణ రంగంలో భారత్-ఆఫ్రికా దేశాల సంబధాలకుగల ప్రత్యేక ప్రాధాన్యతను ఈ సదస్సు ద్రువీకరించింది. ఆఫ్రికా దేశాలకు ఇప్పుడు అన్నికంటే ముఖ్యమైనది శాంతి, రక్షణ. ఇందు కోసం ఆఫ్రికా దేశాలు ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. “తుపాకుల నిశ్శబ్దం: ఆఫ్రికా అభివృద్ధికి అనుకూల వాతావరణ సృష్టి” ఇదే ఈ సంవత్సరం అఫ్రికా యూనియన్, నిర్దేశించుకున్న థీమ్, ప్రధాన లక్ష్యం. ఈ...

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి శ్రీలంక ప్రధాన మంత్రి పర్యటన

శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో భారత్ సందర్శించారు. భారత నాయకత్వంతో ఆయన చర్చలు జరిపారు. రాష్టప్రతి రామనాథ్ కోవింద్ తో రాజపక్స సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. మన విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా శ్రీలంక ప్రధాన మంత్రితో చర్చల్లో పాల్గొన్నారు. భారత్, శ్రీలంక దేశాలు చిరకాల సన్నిహిత స్నేహితులు అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. సంస్కృతి, మతం, ఆధ్యాత్మికత, కళ, భాష వంటి రంగు రంగుల అసంఖ్యాక దారాలతో మన ద్వైపాక్షిక బాంధవ్య చరిత్ర అల్లుకుపోయి ఉంది. భద్రత, ఆర్థిక వ్యవస్థ, సామాజిక ప్రగతి ఏ రంగాల్లో ఆయినా సరే మన గతం, మన భవిష్యత్తు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. శ్రీలంకలో స్థిరత్వం, భద్రత ,సౌభాగ్యాలు కేవలం భారత పరంగానే కాక యావత్ హిందూ మహాసముద్ర ప్రాంత పరంగా కూడా ముఖ్యమైనవి. అందుకే శాంతి సౌభాగ్యాలకు భారత పసిఫిక్ ప్రాంతాల్లో కూడా మన సన్నిహిత సహకారం చాలా విలువైనది. మన 'sagar' అంటే అందరికీ భద్రత పెరుగుదల విధానం, పొరుగుదేశానికి ప్రధమ ప్రాధాన్యం అనే సిద్ధాంతాల ప్రాతిపదికన శ్రీలంకతో భారత్ ప్రత...

పార్లమెంటులో ఈ వారం

కేంద్ర బడ్జెట్ పై చర్చ ముగియడంతో భారత పార్లమెంటులోని ఉభయ సభలు ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాయి. పౌరసత్వ సవరణ చట్టాని కి వ్యతిరేకంగా పలు రాజకీయ పక్షాల అభిప్రాయాల నేపథ్యంలో ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంటు సమావేశాలు అప్పుడప్పుడు అల్లకల్లోలంగా ఉన్నాయి. సభాధ్యక్షుడు అనుమతించిన అన్ని అంశాలపై చర్చలకు తాము సిద్ధమని ప్రభుత్వం తెలియజేసింది. ఈ సమావేశాల్లో నలభై అయిదు బిల్లులను ప్రవేశపెట్టి చర్చించేందుకు అలాగే ఏడు ఆర్థిక అంశాలపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం నిర్దేశించింది. అయితే పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సమాయత్తమయ్యాయి . పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పిఆర్ తదితర అంశాలపై ప్రతిపక్షాలు సభలో రభస చేయడంతో ఎగువ సభ రాజ్యసభ వాయిదా పడింది. సభ తిరిగి సమావేశమవగానే కాంగ్రెస్, వామపక్షాలు, టిఎంసి, డిఎంకె, ఎస్పీ లకు చెందిన సభ్యులు నినాదాలు చేస్తూ వెల్ లోనికి దూసుకువెళ్లారు. గందరగోళం మధ్య, రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేసే తీర్మానంపై చర్చ చేపట్టేందుకు ఉపాధ్యక్షుడు హరివంశ్ ప్రయత్నించారు. చర్చ సజావుగా జరిగేందుకు సహకరించవలసిందిగా సభానాయకుడు తావర్ చంద్ గ...