Posts

Showing posts from August, 2019

ఇరకాటంలో పాకిస్తాన్

భారత జమ్ము , కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఇరకాటంలో పడింది. భారత్ రాజ్యాంగంలోని 370వ అదికరణం కొట్టివేసిన నాటి నుంచి పాకిస్తాన్ పరిస్థితి గందరగోళంలో ఉంది. భారత రాజ్యాంగంలోని 370వ అదికరణం జమ్ము,కశ్మీరుకు స్పెషల్ స్టాటస్‌ను ఇచ్చే అధికరణం. ఈ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని పాకిస్తాన్ చేయని ప్రయత్నం లేదు. అంతేకాదు ఇరుదేశాల మద్య యుద్ధపరిస్థితులను ఇస్లామాబాద్ కోరుకుంటోంది. కానీ పాకిస్తాన్ ప్రయత్నాలు ఫలించలేదు. అంతర్జాతీయ కమ్యూనిటీ పాకిస్తాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రతిస్పందంచలేదు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ప్రగాఢ మిత్రులుగా భావించే ఎంతో శక్తివంతమైన మధ్య ప్రాచ్యం, పశ్చిమ ఆసియా దేశాలలో కూడా ఇండియా జమ్ము, కశ్మీర్ విషయంపై భారత్ తీసుకున్న నిర్ణయం పరంగా ఎలాంటి స్పందన రాలేదు. కశ్మీర్ విషయంలో తొలిసారి ఇస్లామిక్ ‘ఉమ్మా’ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా మౌనంగా ఉండడం ఇదే తొలిసారి. కొన్ని కీలక దేశాలు, అంతర్జాతీయంగా ప్రముఖంగా వ్యవహరిస్తున్న దేశాలు కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం న్యూఢిల్లీ ఆంతరంగిక వ్యవహారమని వ్యాఖ్యానించాయి. టర్కీ, మలేసియాలు మాత్రమే పాకిస్తాన్ వేదనను ఆలకించాయి. పరారీలో ఉన్న భారత దేశ...

ఇండియా-రష్యా: కొత్త రంగాలలో సహకారం దిశగా కొనసాగిస్తున్న కృషి

ప్రధాని మోదీ రెండవ పర్యాయం ప్రధాని పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత, రష్యాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను కొత్త ఎత్తులకు తీసుకువెళ్లడానికి సంసిద్ధమ య్యాయి. ప్రధాని మోదీ తూర్పు ఆర్థిక వేదిక ఐదవ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాదు 2019 సెప్టెంబరు 4 నుంచి 6 వరకూ వ్లాదివోత్తోక్‌లో ఇరు దేశాల మధ్య జరగనున్న 20వ వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర మహాసభకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. కొత్త రంగాలలో సహకారానికి సరికొత్త అవకాశాలను ఇరుదేశాలూ అన్వేషిస్తున్నాయి. తద్వారా రెండు దేశాల మధ్య ఉన్న స్పెషల్ అండ్ ప్రివిలైజ్డ్ స్ట్రేటజిక్ పార్టనర్‌షిప్‌ని మరింత శక్తివంతం చేసే దిశగా ఇరుదేశాలూ అడుగులు వేస్తున్నాయి.  భారత ప్రభుత్వం మన రాజ్యాంగంలోని 370 రాజ్యాంగ అధికరణను రద్దు చేయడాన్ని మొట్టమొదట ఆహ్వానించిన దేశాలలో రష్యా కూడా ఉంది. ఈ అంశాన్ని భారత అంతర్గత విషయంగా మాస్కో వ్యాఖ్యానించింది. అంతేకాదు భారత్‌కు పలు అంతర్జాతీయ వేదికలపై తన సంపూర్ణ మద్దతు తెలిపింది.  ఈ నెల ప్రారంభంలో భారత కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వ్లాదివోత్సోక్‌లో పర్యటించారు. ఆయనతోపాటుగా నాలుగు రాష్ట్...

జీ-7 భేటీలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ల సమావేశం

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మెక్రాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని జీ 7 సదస్సుకు ‘ప్రత్యేక అతిథి’గా ఆహ్వానించారు. ఫ్రాన్స్‌లోని బిరిట్జ్‌లో ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సు సందర్భంగా భారత్, ఫ్రాన్స్‌లు కలిసి పని చేయవలసిన అనేక అంశాలు తెర మీదకు వచ్చాయి. ఇరాన్ అణు ఒప్పందం కొనసాగింపు, వాతావరణ మార్పులపై పోరాటం లాంటి అంశాలు అనేకం ఉన్నాయి. ఈ సదస్సు సందర్భంగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లు విడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు వాణిజ్యం, ఆర్థిక పరమైన అంశాలు చర్చించారు. డబ్ల్యుటీవో భారత్‌కు ఇచ్చిన ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ అనే ట్యాగ్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంటోందని అమెరికా అధ్యక్షుడు ఈ సందర్భంగా నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ట్యాగ్‌ను ఉపయోగించుకొని అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తోందని ఆయన అన్నారు. దీనికి ప్రతిగా అమెరికా భారత దేశం నుంచి దిగుమతి అవుతున్న ఉక్కుపై అధిక సుంకాలు విధించారు. దీనివల్ల భారత ఉత్పత్తులు ప్రియంగా మారేలా చేశారు. భారత దేశం కూడా 2019 జూన్‌లో అమెరికాకు చెందిన 28 రకాల ఉత్పత్తులపై సుంకాలను విధించింది. ఇరు దేశాల నేతలు ఈ అంశంలో వ్...

జపాన్-దక్షిణ కొరియాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు

ముఖ్యమైన అతి పెద్ద తూర్పు ఆసియా ఆర్థిక వ్యవస్థలైన జపాన్, దక్షిణ కొరియా దేశాలు వాణిజ్యపరమైన ఒత్తిడులతో మల్లగుల్లాలు పడుతున్నాయి. తీవ్ర ఉద్రిక్తతలతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దక్షిణ కొరియాపై నియంత్రణతో కూడిన వాణిజ్య చర్యలను జపాన్ విధించింది. మూడు రసాయనాల ఎగుమతులపై ఉచ్చుబిగించింది. వాటిల్లో భారీ సాంకేతిక పరిశ్రమల్లో వాడే హైడ్రోజన్ ఫ్లోరైడ్ గ్యాస్, ఫ్లోరినేటెడ్ పొలిమైడ్, ఫ్ రెసిస్టెంట్‌లు ఉన్నాయి. ఈ చర్యలు చేపట్టడానికి జాతి భద్రతను కారణంగా జపాన్ చూపుతోంది.  ఈ రసాయనాల వినియోగంపై జపాన్ తన ఆందోళనను వివరించింది. వీటిలో సైనిక అవసరాలకు ఉపయోగపడే అప్లికేషన్లు కూడా ఉన్నాయని అది చెప్తోంది. యుఎన్ఎస్‌సి షరతుల అమలు విషయంలో దక్షిణ కొరియా పంథాపై టోక్యో ఆందోళనను వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. అలాగే సున్నితమైన మెటీరియల్‌కు సంబంధించి అంతర్జాతీయ ఎగుమతి నియంత్రణ పాలన వర్తింపుపై కూడా ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఇంకా, తన ప్రిఫెరెన్షియల్ ‘వైట్ లిస్ట్’ నుంచి దక్షిణ కొరియాను జపాన్ తొలిగించింది. ఈ జాబితాలో నమ్మదగ్గ వాణిజ్య భాగస్వామ్య దేశాలు మాత్రమే ఉంటాయి. దాదాపు 1,100 ముఖ్యమైన ఐటమ్స్‌ పై కఠినమైన...

జి-7 శిఖరాగ్ర సమావేశం

ఫ్రాన్స్ 1975లో జి-7 శిఖరాగ్ర సమావేశాలకు శ్రీకారం చుట్టింది. వీటిద్వారా ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థికవ్యవస్థలున్న ఏడు దేశాల నాయకులు పలు గ్లోబల్ అంశాలపై చర్చలు చేస్తారు. జి-7 పరిధిలోకి రాని ముఖ్యమైన ఇతర దేశాలకు సైతం సంక్లిష్ట రంగాలకు సంబంధించిన చర్చలను ఇది విస్తరిస్తుంది. జి-7 చర్చలు అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావాన్ని తీసుకురాగలవు. 1989 సంవత్సరంలో జి-7శిఖరాగ సమావేశాన్ని ఫ్రాన్సు నిర్వహించింది. అప్పుడే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్కు ఫోర్సు (ఎఫ్ఎటిఎఫ్)ను ఏర్పాటు చేసింది. హవాలాకు అడ్డుకట్టవేయడం, ఉగ్రవాదానికి నిధులు అందించడం వంటి వాటిని ఈ సంస్థ అడ్డుకుంటుంది. ఇటీవల సంవత్సరాల్లో ఎఫ్ఎటిఎఫ్ సభ్యురాలిగా భారత్ ఈ వేదికపై నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిధులు అందించడాన్ని వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ సహకారాన్ని కోరింది. ఫ్రాన్సులోని బియార్రిట్జ్ లో నిర్వహిస్తున్న జి-7 సమావేశంలో ‘స్పెషల్ బియార్రిట్జ్ పార్టనర్’గా పాల్గొనవలసిందంటూ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫ్రాన్స్ ఆహ్వానం పంపింది. భారత్‌ను అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ముందుకు తీసుకురావాలని ఫ్రాన్సు భావించింది. అసమానతలపై శక్తివంతంగా, న్యాయబద్ధంగా, సంక్లిష్టరహ...

భారత ప్రధాని యుఎఇ, బహ్రైన్ పర్యటనలతో మరింత శక్తివంతమైన ద్వైపాక్షిక సంబంధాలు

వారాంతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ యుఎఇ, బహ్రైన్‌లలో పర్యటించారు. గత నాలుగు సంవత్సరాల కాలంలో యుఎఇకి భారత ప్రధాని నాల్గవ పర్యాయం పర్యటించారు. అలాగే బహ్రైన్‌లో తొలిసారి పర్యటించిన భారత ప్రధాని కూడా మోదీనే. అరబ్ గల్ఫ్ దేశాలతో భారత్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలు బాగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ పర్యటనలు చోటుచేసుకున్నాయి. యుఎఇలో క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబు ధాబి మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్-నహ్యాన్‌ను ప్రధాని మోది కలిశారు. ఆయనతో రెండు దేశాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మోదీ చర్చలు జరిపారు. ప్రధాని మోదీకి యుఎఇ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పౌర అవార్డు ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ను ఒక సమావేశంలో ప్రదానం చేసింది. మోదికి ఈ అవార్డును 2019 ఏప్రిల్‌లో ప్రదానం చేశారు. భారత్, యుఎఇల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడానికి మోది చేసిన కృషికి, ఆయన అత్యున్నత నాయకత్వ పరిణతికి ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు. భారత ప్రధాని యుఎఇలో రుపె కార్డును ప్రారంభించారు. పశ్చిమాశియాలో చెల్లింపుల కోసం దేశీయ ఇండియన్ కార్డును ప్రారంభించిన తొలి దేశం యుఎఇ. సింగపూర్, భూటాన్ దేశాల తర్వాత దీన...

భారత-జాంబియా సంబంధాలను మరింత పెంచనున్న జాంబియా ప్రెసిడెంట్ భారత పర్యటన

జాంబియా అధ్యక్షుడు ఎడ్గర్ ఛాగ్వా లుంగు భారత్‌లో పర్యటించారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనను భారత్‌లో పర్యటించవలసిందిగా ఆహ్వానించారు. భారత్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జాంబియా అధ్యక్షుడి భారత తొలి పర్యటన ఇది. అంతేకాదు జాంబియా అధ్యక్షుడు లుంగు మొట్టమొదటిసారి భారతదేశాన్ని సందర్శించడం మరో విశేషం. పదహారు సంవత్సరాల క్రితం జాంబియా అధ్యక్షుడు లెవీ వనవాసా 2003 ఏప్రిల్‌లో భారత్‌ను సందర్శించారు. ఆఫ్రికా దేశాలతో సత్సంబంధాల విధానాన్ని భారత్ చేపట్టిన విషయం తెలిసిందే. మూడవ ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ శిఖరాగ్ర సదస్సు జరగనున్న సమయంలో భారతదేశంలోని పలు రాజకీయ నాయకులు ఆఫ్రికా దేశాలకు 32 మార్లు పర్యటించారు. అలాగే ఆఫ్రికా దేశాల నాయకులు కూడా భారత దేశానికి 35 మార్లు పర్యటించారు. రాష్ట్రపతి కోవింద్ 2018లో జాంబియా పర్యటన చేసిన పదహారు నెలల తర్వాత జాంబియా అధ్యక్షుడి పర్యటన చోటుచేసుకుంది. ద్వైపాక్షిక సంబంధాల ప్రగతి సమీక్ష పరంగా జాంబియా అధ్యక్షుడి పర్యటన చాలా ముఖ్యమైంది.  జాంబియా అధ్యక్షుడి పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో విందు నిర్వహించారు. జాంబియా అధ్యక్షులు రాజ్ ఘాట్‌ను సందర్శ...

మరింతంగా పుంజుకున్న భారత-ఫ్రాన్స్ సంబంధాలు

ఈ వారంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ లో పర్యటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పెంపుదలే ఈ పర్యటన లక్ష్యం. అంతేకాదు 20 సంవత్సరాల కాలపరిమితితో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై ఇరుదేశాలు 1998లో సంతకాలు చేశాయి. జమ్ము, కశ్మీర్‌లోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఫ్రాన్స్ జమ్ము, కశ్మీర్ అంశం భారత అంతర్గత అంశంగా పేర్కొనడం న్యూఢిల్లీకి నూతన శక్తిని ఇచ్చింది. యుఎన్ఎస్‌సి అధికారిక సంప్రదింపుల్లో భారత్‌కు అండగా నిలబడింది.  ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం’ అనే మూడు అంశాల పునాదిగా భారత, ఫ్రెంచి సంబంధాలు కొనసాగుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య పటిష్టమైన సహకారం కొనసాగుతోందన్నారు. అంతేకాదు రెండు దేశాలు కూడా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకునే దిశగా రోడ్‌ మ్యాప్ కూడా రెండు దేశాలూ తయారుచేసుకున్నాయి. వాటిల్లో అభివృద్ధి సామర్థ్యం, పౌర విమానయానం, ఐటి, అంతరిక్షం వంటి అంశాలు ఉన్నాయి. ఇరుదేశాల మధ్య రక్షణ సహకారం అనేది సంబంధాల బలోపేతానికి కీలక స్తంభం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సెప్టెంబరులో తొలి రాఫెల్ విమానాలను...

ద్వైపాక్షిక సంబంధాలను నూతన తీరాలకు తీసుకుపోనున్న భారత్, నేపాల్

ఇటీవల భారత్, నేపాల్ జాయింట్ కమిషన్ 5వ సమావేశం ఖట్మాండులో జరిగింది. సందర్భంగా ఇరు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు కొన్ని ప్రత్యేకమైన అంశాలపై దృష్టి సారించాలని నిర్ణయించాయి. ఇరు దేశాల్లోని ప్రాంతాల అనుసంధానం, ఆర్థిక భాగస్వామ్యం, వాణిజ్యం, రవాణ, విద్యుత్, నీటి వనరులు, సంస్కృతిక రంగం, విద్యా రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ సమావేశానికి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు అధ్యక్షత వహించారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి డా. సుబ్రమణ్యం జైశంకర్ ఢాకా నుంచి ఖాట్మాండుకు బయలుదేరి వెళ్లారు. ఢాకాలో పరస్పర ప్రయోజనాలు, ప్రాంతీయ అంశాలపై అక్కడి నేతలతో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఖాట్మాండుకు వెళ్లారు. జాయింట్ కమిషన్ సమావేశానికి ముందు డా. జైశంకర్ నేపాల ప్రధాని కె.పి.శర్మ ఓలిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది మే నెలలో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండవ సారి తిరిగి ఎన్నికైన తర్వాత నేపాల్‌కు ఒక ఉన్నత స్థాయి పర్యటన జరగడం ఇదే తొలిసారి. నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి జాయింట్ కమిషన్ సమావేశం జరగడం సంతోషంగా ఉందనీ, భారత్-నేపాల్‌ల మంధ్య సంబంధాలను ఇది బలోపేతం చేస్తుందని...

భారత బాల్టిక్స్ విస్తరణ

భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఎస్టోనియా, లాట్వియా, లిధుయేనియా దేశాలలో పర్యటించారు. ఇది బాల్టిక్ దేశాలతో భారత సంబంధాలలో మైలురాయిగా చెప్పాలి. ఇప్పటి వరకూ బాల్టిక్స్ దేశాలతో భారత్ నడిపిన సంబంధాలలో అత్యున్నత స్థాయి దౌత్య చర్యగా దీన్ని అభివర్ణించాలి. ఆ దేశాల అధినాయకులతో సమావేశం కావడంతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పలు వాణిజ్య సమావేశాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతేకాదు ఆ దేశాలలోని భారతీయులతో సంభాషించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సహకారానికి సంబంధించి పలు ఎంవొయులు చేసుకున్నారు. ఒప్పందం కుదుర్చుకున్న రంగాలలో వ్యవసాయం, సైబర్ సెక్యూరిటీ, ఇ-గవర్నెన్స్, విద్య తదితర రంగాలు ఉన్నాయి. భారత ఉపరాష్ట్రపతి ఇస్తోనియన్ హెడ్స్ ఆఫ్ మిషన్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ చర్చలు ప్రధానంగా సంస్కృతం, యోగా, ఆయుర్వేదాలలో భారత ప్రాంతీయ నాగరికతా అంశాల పరంగా బాల్టిక్స్ దేశాల ప్రజల అంతరంగం పెనవేసి ఉన్న వైనంపై సాగాయి. చారిత్రకమూలాలతో కొనసాగుతున్న ఈ సంబంధాలు రెండు దేశాల మధ్య సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలను మరింత వృద్ధిచేస్తాయి. ఇది వసుధైవ కుటుంబకం (ప్రపంచం ఒక కుటుంబం అని సంస్కృతంలో దీని అర్థం) సిసల...

భారత విదేశాంగమంత్రి తొలి బంగ్లాదేశ్ పర్యటన

భారత విదేశాంగమంత్రి డా. ఎస్. జైశంకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి బంగ్లాదేశ్ పర్యటన చేశారు. ఇది పూర్తిగా గౌరవపురస్కరమైన పర్యటన మాత్రమే. బంగ్లాదేశ్ షేక్ హసీనా అక్టోబర్ మొదటి వారంలో భారత్‌లో పర్యటన చేస్తున్నారు. భారత్‌లో పర్యటించవలసిందిగా భారత ప్రధాని మోదీ ఆమెను కోరారు. రెండు పొరుగుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపరిచే ముఖ్యమైన చర్య ఇది.  భారత విదేశాంగమంత్రి బంగ్లాదేశ్ ప్రధానితో జరిపిన సమావేశం ఫలవంతమైంది. అక్టోబర్‌లో రెండు దేశాలకు చెందిన నాయకుల సమావేశానికి అనుకూల వాతావరణం ఏర్పరిచే దిశగా దీన్ని భావించాలి.  భారత ప్రధాని నరేంద్రమోదీ నుంచి ఆహ్వానపత్రికను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు గనోబాభన్‌లో జరిగిన సమావేశంలో భారత విదేశాంగమంత్రి డా.జైశంకర్ అందజేశారు. గనోభాభన్ హసీనా అధికారిక నివాసం. మోదీ ఆహ్వానం పట్ల షేక్ హసీనా తన కృతజ్ఘతను వెల్లడించారు.  అక్టోబర్‌లో షేక్ హసీనా భారత పర్యటన పట్ల న్యూఢిల్లీ ఎంతో ఆశావహ దృష్టితో ఉన్నట్టు భారత విదేశాంగమంత్రి తెలిపారు. జైశంకర్, షేక్ హసీనా ఇరువురూ సుహృద్భావ వాతావరణంలో ఫలవంతమైన చర్చలు జరిపారు. వారి చర్చల్లో ర...

యుఎన్ఎస్‌సిలో ఏకాకి అయిన పాక్

కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ చేయాలన్న పాక్ ప్రయత్నాలు మరోసారి బెడిసికొట్టాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్ చేసిన ప్రయత్నాలపై ఇసుమంత స్పందన సైతం కరువైంది. తన మిత్రదేశమైన పాకిస్తాన్ కోసం మండలిలోని 15 సభ్యదేశాలతో అత్యవసర సమావేశాన్ని చైనా కోరింది. ఆ సమావేశంలో కేవలం భారత్ జమ్ము-కశ్మీర్‌పై తీసుకున్న అంశంపైనే చైనా చూపు నిలపడం కనిపించింది. మిగతా పెద్ద దేశాలన్నీ కూడా భారత్‌తో ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని కోరాయి. జమ్ము, కశ్మీర్‌కు సంబంధించిన భారత్ రాజ్యాంగంలోని 370వ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత నుంచి పాక్‌కి నిద్రకరువైంది. భారత్ చేపట్టిన ఈ చర్య పాకిస్తాన్‌ జమ్ము-కశ్మీర్‌పై ఇన్నాళ్లు కొనసాగిస్తూ వచ్చిన పంథాకు అడ్డుకట్టపడింది. జమ్ము, కశ్మీర్‌లకు సంబంధించి తీసుకున్న చర్యలు భారత దేశ అంతర్గత అంశమంటూ కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. దీనిని అమెరికా ప్రభుత్వ యంత్రాంగం కూడా గుర్తించింది. భారత్ తీసుకున్న ఈ చర్య భారత రాజ్యాంగానికి లోబడి ఉందని రష్యా అభిప్రాయపడింది. అంతేకాదు ఈ సమస్యను భారత్, పాక్‌లు ద్వైపాక్షికంగా, రాజకీయంగా, దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని కోరింది. ఈ సమావేశ అనధికార వ...

భారత ప్రధాని భూటాన్ పర్యటన: ద్వైపాక్షిక సంబంధాల విస్తరణకు ఎజెండా

ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజులు థింపులో పర్యటించారు. భూటాన్ ప్రధాని డా లొతాయ్ షెరింగ్ ఆహ్వానంపై ప్రధాని మోదీ భూటాన్ సందర్శించారు. ఆయనతోపాటు అత్యున్నతస్థాయి ప్రతినిధివర్గం కూడా థింపు వెళ్లింది. రెండవ పర్యాయం ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలి భూటాన్ పర్యటన ఇది. గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రధాని చేపట్టిన రెండవ భూటాన్ పర్యటన ఇది. రెండవ పర్యాయం అధికారపగ్గాలను చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులు, శ్రీలంకలో పర్యటించారు. పొరుగున ఉన్న రెండు మూడు దేశాలకు ప్రధాని పర్యటన ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ పాలసీకి భారత్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని స్పష్టంచేస్తోంది.  జమ్ము, కశ్మీర్ (జె అండ్ కె) అంశాన్ని పాకిస్తాన్ అంతర్జాతీయ చేయాలని ప్రయత్నిస్తున్న తరుణంలో దాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో భూటాన్ పర్యటనకు ప్రధాని హాజరవుతున్నారు. జె అండ్ కె ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని ముందే భూటాన్ ఆహ్వానించింది. ఇది ఎంతో సాహసోపేతమైన, ధైర్యవంతమైన, మంచి భవిష్యత్తు దిశగా తీసుకున్న నిర్ణయంగా భూటాన్ అభివర్ణించింది. అంతేకాదు జె అండ్ కె పూర్తిగా భారత్ అంతర్గత అంశమని భూటాన్ గుర్తించింది. ...

యెమెన్‌లో కనపించని శాంతి

యెమెన్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యెమెన్ వేర్పాటు ఉద్యమం అధిపతి ప్రస్తుతం చిరు ఆశగా కనిపిస్తున్నారు. అడెన్ తిరుగుబాటు అనంతరం సౌదీ సారథ్యంలో శాంతి సంభాషణల్లో పాల్గొనేందుకు యెమెన్ వేర్పాటువాదం నాయకుడు తన సంసిద్ధతను వ్యక్తంచేశారు. యెమెన్‌లోని దక్షిణ వేర్పాటు దళాలకు యుఎఇ మద్దతు ఉంది. అవి అడెన్‌లోని అధ్యక్షభవనంను చుట్టుముట్టాయి. ఆ తీవ్ర పోరాటంలో 40 మంది ప్రాణాలు పోయాయి. 260 మంది గాయాలుపాలయ్యారు. వేర్పాటువాద నాయకుడు అదారస్ అల్ జుబైది మాట్లాడుతూ అబ్దరాబు మాన్‌సోర్ హది దళాలను హింసకు ప్రేరేపించాయి. ఆ దళాలే హొథి ఉద్యమం నాయకులను హత్యచేసేందుకు ప్రయత్నించాయి. వారిని లేపేయాలని చూశాయి. అడెన్ నగరంలో సౌద్రన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (ఎస్‌టిసి)పై సౌదీ ఎయిర్ దాడులు జరిగే సమయంలో ప్రకటన వచ్చింది. యుఎఇ, సౌదీ అరేబియా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న యెమెన్ రాజకీయ పక్షాలు అడెన్‌లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు వచ్చే వారంలో చర్చలకు కూడా ఆహ్వానించింది. ఆరబ్ స్ర్పింగ్ చెలరేగడం వల్ల జరిగిన రాజకీయ బదలాయింపు వైఫల్యంలో సంఘర్షణా మూలాలు ఉన్నాయి. దీనివల్ల ఆలి అబ్దుల్లా సలాహ్ తప్పనిసరి పరిస్థితుల్లో తన డిప్య...

గల్ఫ్ దేశాల చేతుల్లో పాకిస్తాన్‌కు అవమానం

గల్ఫ్ ఆరబ్ దేశాల నుంచి పాకిస్తాన్ ఊహించిన స్పందన రాలేదు. భారత రాజ్యాంగంలోని 370వ ప్రకరణను రద్దుచేయడంపై, కశ్మీర్, జమ్ము, లదాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా భారత్ ప్రకటించడంపై గల్ఫ్ దేశాలు చాలామటుకు మౌనం వహించాయి. అవి భారత్ విషయంలో మౌనంగా ఉండడానికి పెరుగుతున్న భారత ప్రతిష్ఠతో పాటు సుస్థిర, పరిణితిగల దేశంగా అది కొనసాగుతున్న తీరు ప్రధాన కారణాలు. అంతేకాదు మూడొంతులు గల్ఫ్ దేశాలన్నింటితో భారత్‌కు వ్యూహాత్మకమైన సన్నిహిత సంబంధాలు నెలకొని ఉన్నాయి. అంతేకాదు ఈ దేశాలతో భారత్ 100 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వాణిజ్యాన్ని ప్రతి ఏటా చేస్తోంది. అందుకే అరేబియన్ ద్వీపకల్పంలో భారత్ అతిముఖ్యమైన ఆర్థిక భాగస్వామిగా నిలిచింది.  సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ దేశం. భారత్ చేపట్టిన చర్యలపై నియంత్రణ పాటించాలని ఈ సందర్భంగా అది కోరింది. కువైట్, కతార్, బహ్రైన్, ఒమన్ లాంటి ముఖ్యమైన దేశాలు కశ్మీర్ అంశంపై, 370వ అధికరణ రద్దుపై ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనిపై ప్రతిస్పందిస్తూ ‘ఇది భారత ఆంతరంగిక అంశం’ అని వ్యాఖ్యానించింది. ఇది చాలా ముఖ్యమైన ప్రకటన. అలాగ...

నూతన భారతాన్ని ఆవిష్కరించిన ప్రధాని స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగం

రెండవ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ప్రధాని నరేంద్రమోదీ చేశారు. ఈ ప్రసంగం ఆసాంతం ప్రధాని రాజకీయంగా, సామాజికంగా ఎంతో శక్తివంతమైన సందేశాన్ని 1.3 బిలియన్ మంది దేశ ప్రజలకు అందించారు. నిజం చెప్పాలంటే, మొట్టమొదటిసారి భారత రాజకీయ చరిత్రలో ప్రధాని తొలిసారి స్వాతంత్ర్య దినోత్సవం రోజు జనాభా పెరుగుదలపై ఆందోళన వ్యక్తంచేశారు. దేశ అభివృద్ధిపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, 2027 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో భారత్ చైనాను అధిగమిస్తుందని చెప్తోంది. జనాభా పెరుగుదలను పట్టించుకోని పక్షంలో మిలియన్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేయడం చాలా కష్టం. అంతేకాదు వారి సంక్షేమ ప్రయోజనాలకు వెచ్చించేది కూడా పెట్టలేని పరిస్థితి వస్తుంది. ప్రతి ఇంటికి స్వచ్ఛఇంధనాన్ని అందించాలన్న లక్ష్యాన్ని భారత ప్రభుత్వం పెట్టుకుంది. అలాగే మరుగుదొడ్లు, విద్యుత్, గృహాలు, తాగునీరు, ఆరోగ్యం వంటి ఎన్నో లక్ష్యాలను ప్రభుత్వం పెట్టుకుంది. పేద ప్రజలకు అందించే ఈ ప్రయోజనాలన్నీ కూడా జనాభా అపరిమితంగా పెరగడం వల్ల సాధ్యంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇద...

నూతన భారతానికి రాష్ట్రపతి పిలుపు

భారత గౌరవనీయ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ దేశ 73వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వతంత్ర దేశంగా భారత్ నిలబడి ఇప్పటికి 72 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇంకొక ముఖ్య అంశం ఏమిటంటే, ప్రత్యేక సందర్భంలో 73వ స్వాతంత్ర దినోత్సవాన్ని చేసుకోవడం మరో విశేషం. ఇప్పటి నుంచి కొన్ని వారాల్లో, అంటే అక్టోబర్ 2న భారత్ జాతిపిత మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవాలను జరుపుకుంటున్నాం. భారతదేశ స్వాతంత్ర్య సాధనలో ఆయన ఒక వెలుగుగా మార్గనిర్దేశం చేసిన మహాత్ముడు. దేశంలోని అన్ని రకాల అసమానతలను పోగొట్టి సంస్కరించే దిశగా భారత్ నిరంతరాయంగా కృషిచేస్తూనే ఉంది. మహాత్మాగాంధీ జీవించిన, పనిచేసిన సమయం, సమకాలీన భారతం రెండూ పరస్పర భిన్నమైనవని రాష్ట్రపతి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఈ రోజుకి కూడా గాంధీజీ చెప్పిన అంశాలు అనుసరణీయాలుగా, సమకాలీనమైనవిగా నిలిచిపోయాయి అని రాష్ట్రపతి అన్నారు. పేదలైన ప్రజలకు, కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలను రూపొందించేటప్పుడు, సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ను రిన్యువబుల్ ఎనర్జీగా (పునరుత్పత్తి శక్తిగా) చేసేటప్పుడు గాంధీ తత్వాన్ని చేతల్లో మనం ఆవిష్కరిం...

సంబంధాల అభివృద్ధికై విదేశ వ్యవహారాల మంత్రి చైనా పర్యటన

దౌత్యపరంగా చైనాతో సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బీజింగ్‌కు అధికార పర్యటనకు వెళ్లారు. సాంస్కృతిక ఉన్నత స్థాయి యంత్రంగంతో పాటు రెండు దేశాల ప్రజల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలకు సంబంధించి సమావేవంలో చర్చించేందుకు మంత్రి చైనా వెళ్లారు. ఈ పర్యటన ప్రధానంగా ఈ సంవత్సరం అనంతరం చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్ భారతదేశాన్ని సందర్శిస్తున్ననేపథ్యంలో మంత్రి భారత విదేశాంగమంత్రి బీజింగ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘వుహాన్’ తరహా సమావేశానికి రెండవ పర్యాయం భారత ప్రధాని నరేంద్రమోదీతో అనధికారికంగా సమావేశం అయింది. అంతేకాదు భారత్, చైనాల దౌత్య సంబంధాలు 70వ సంవత్సరంలో అడుగుపెట్టాయి. దీన్ని కూడా రెండు దేశాలు జరుపుకుంటున్నాయి. జమ్ము,కశ్మీర్‌కు సంబంధించి పార్లమెంటులో భారత్ చేపట్టిన చట్టం గురించి కూడా రెండు దేశాల విదేశాంగమంత్రుల సమావేశంలో చర్చకు వచ్చింది. భారత విదేశాంగమంత్రి జైశంకర్ చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ కిషాన్‌తో కూడా చర్చలు జరిపారు. రెండు దేశాలు కూడా అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున పరిణామాలపై చర్చించారు. అంతేకాదు ప్రస్తుతం ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా చైనా, భారత్‌లు సమా...