మొజాంబిక్తో బలపడుతున్న భారత్ సంబంధాలు
మొజాంబిక్తో వ్యూహాత్మక సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు బలపడడానికి భారత్ పూనుకుంది. మొజాంబిక్లో భారత్ భారీస్థాయిలో ఆర్థిక పెట్టుబడులను కూడా పెట్టింది. రెండు దేశాలూ రెండు ముఖ్యమైన పరస్పర ప్రయోజనకర ఒప్పందాలపై సంతకాలు కూడా చేశాయి. అవే ‘వైట్ షిప్పింగ్’ ఒప్పందాలు. వైట్ షిప్పింగ్కు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే సముద్రం తదితర జలవనరుల ప్రాంతాలకు సంబంధించిన రంగంలో (హైడ్రోగ్రఫీ)సహాకారాన్ని ఇచ్చిపుచుకోవాలని ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన మూడు రోజుల మొజాంబిక్ పర్యటనలో ఆ ఆఫ్రికా దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొజాంబిక్ రక్షణ మంత్రి అతనసియోమ్తుముకెతో ద్వైపాక్షిక సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా మంత్రి సింగ్ మాట్లాడుతూ ఆఫ్రికాలోని భారత అత్యంత మిత్రదేశాల్లో, భాగస్వాముల్లో మొజాంబిక్ కూడా ఒకటని వ్యాఖ్యానించారు. గణాంకాలు సూచిస్తున్న దాని భారత పెట్టుబడులు ఏడు బిలియన్ అమెరికన్ డాలర్ల వరకూ ఉన్నాయి. ప్రధానంగా భారత పెట్టుబడులు విద్యుత్, బొగ్గు రంగాలలో 25 శాతం మేర ఉన్నాయి. 2017 లో మొజాంబిక్ ఎగుమతులకు భారత్ అతిపెద్ద నిలయంగా ఉంది. ఆ దేశం మొత్తం ఎగుమతు...