మౌలిక సదుపాయ రంగంలో భారత్ నిర్ణయాత్మక పెట్టుబడుల వెల్లువ - పటిష్టమైన వృద్ధి
ఆర్థిక మంగమనాన్నినిలువరించి, తన పరిశ్రమకు మద్దతు విధానంతోపాటు కార్యక్రమాలను కొనసాగించే లక్ష్యంతో గణనీయమైన ప్రతయ్నంలో భాగంగా ప్రభుత్వం బుధవారం నాడు ఒక భారీ ప్రణాళికను ఆవిష్కరించింది. దీనికింద రాగల ఐదేళ్లలో దేశంలోని మౌలిక సదుపాయ రంగంలో వంద లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని సంకల్పించారు. ఈ సందర్భంగా రైల్వేలు, వాణిజ్యం - పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ - ఇంత భారీ స్థాయి పెట్టుబడి వల్ల మౌలిక వసతుల లభ్యత, నాణ్యత గణనీయంగా పెరుగుతాయని స్పష్టం చేశారు. విమానయానం, నౌకాయానం రోడ్లు, రహదారులు, రైల్వేలు, రేవులే కాక విద్యుచ్ఛక్తి, చమురు, గ్యాసు రంగాలకు నూతనోత్తేజం లభించి వచ్చే ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా, సమర్థంగా తయారవుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన రైల్వేనెట్ వర్కులతో అధిపతిగా వున్న భారత రైల్వేలు 50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో 12 సంవత్సరాల ప్రణాళికను రూపొందించిందని, మధ్యకాలానికి సంబంధించినంతవరకు ఇది ఊహకు కూడా అందనంతటి పెద్ద మొత్తమని పీయూష్ గోయల్ చెప్పారు. అయితే ఈ స్థాయిలో పెట్టుబడి ఒక్క ప్రభుత్వం వల్లనే సాధ్యం కాదుకనుక తగిన ప్రోత్సాహకాలతో ప్రైవేటురంగానికి కూడా...