Posts

Showing posts from September, 2019

పాకిస్తాన్ విద్వేషాన్నిస్వీకరించడానకి ఎవ్వరూ సిద్ధంగా లేరు

కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేద్దామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రయత్నాలు 74వ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో కూడా వైఫల్యం చెందాయి. జమ్ము,కశ్మీర్ రాష్ట్రాల ప్రజల ఈతిబాధలపై తన ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడ్డారు. కానీ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ యుద్ధ ప్రస్తావన కూడా తెచ్చారు. అంతేకాదు ‘న్యూక్లియర్’ అనే పదాన్ని కూడా ఇమ్రాన్ ఖాన్ ఉపయోగించారు. అందరి దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో పాక్ ప్రసంగ తీరు కొనసాగింది.  అమెరికా యంత్రాంగం నుంచి కూడా కశ్మీర్ అంశంపై ఎలాంటి మద్దతు లభించడం లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ గుర్తించారు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఒక సందర్భంలో స్పందిస్తూ కశ్మీరీల గురించి మాట్లాడుతున్నంతగా యుఘుర్స్ బాధితులు పడుతున్న కష్టాలపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడడం లేదని కూడా తీవ్రంగా విమర్శించింది దక్షిణ, మధ్య ఆసియా యాక్టింగ్ సహాయ కార్యదర్శి అలిస్ వెల్స్ మాట్లాడుతూ ‘కశ్మీర్‌పై గొంతు తగ్గించడం అవసరం అన్నారు. ముఖ్యంగా రెండు న్యూక్లియర్ దేశాలు కూడా ’ అని ఆమె అభిప్రాయపడ్డారు. మి...

అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న శ్రీలంక

శ్రీలంకలో ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణంలాగే దాని రాజకీయ చిత్రపటం కూడా వైవిధ్యమైన మార్పులను ప్రతిబింబిస్తోంది. నవంబరు 16వ తేదీన నాల్గవ దేశాధ్యక్షుని ఎన్నికల దిశగా ఆ దేశం ముందుకుసాగుతోంది. శ్రీలంకలో ఇప్పటివరకూ రాజకీయ ప్రచారం ఎలాంటి గొడవలకు తావులేకుండా నిశ్శబ్దంగా సాగిపోయింది. అలా అని నిరుత్సాహకర వాతావరణం కూడా ఏమీ లంకలో లేదు. ఆ దేశ రాజ్యాంగంలో ఎన్నికల ప్రహసనం ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ఆ దేశ ఎన్నికల కార్యాలయం ఎంతో శక్తివంతమైంది. ఇది కొంతవరకూ అసాధారణ విషయంగా కనిపించినా ఆశ్చర్యమైన విషయం మాత్రం కాదు. అయితే ఎన్నికల పట్ల ప్రజల్లో తగినంత ఆసక్తి లేకపోవడానికి కారణం ఇప్పటికీ అక్కడ ప్రజలు ఈస్టర్ సండే రోజు జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడులను మరిచిపోలేకపోతున్నారు. దేశంలోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలు ప్రజల ముందు కొత్తగా పెట్టేదేమీ లేదు కూడా. మాజీ రక్షణ కార్యదర్శి గోటాబాయా రాజపక్సే ఎన్నికల బరిలో సరైన సమయంలో దిగారు. గోటాబాయా శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే చిన్న సోదరుడు. సంవత్సరం ప్రారంభంలో ఆయన తన అమెరికన్ పౌరసత్వాన్ని వీడి శ్రీలంక పౌరసత్వాన్ని తీసుకోనున్నట్టు ప్రకటి...

యుఎన్‌జిఎ 74వ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం

భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (యుఎన్‌జిఎ) లో జరిగిన చర్చలో పాల్గొని సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఎఫెక్టివ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఫర్ పావర్టీ ఎరాడికేషన్, ఇంక్లూషన్ అండ్ క్లైమేట్ ఛేంజ్’ అనే అంశంపై ప్రధాని ప్రసంగించారు. నాలుగు సంవత్సరాల క్రితం అంటే 2015, సెప్టెంబరు 25వ తేదీన ప్రధాని యుఎన్‌జిఎ ప్రత్యేక శిఖరాగ్ర సదస్సులో ప్రపంచదేశాల నాయకులను కలిశారు. వీరంతా కలిసి సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ‘ఎజెండా 2030’ ని చేపట్టారు. జాతీయ అభివృద్ధి పరంగా పెట్టుకున్న అభివృద్ధి లక్ష్యాలను భారత్ అజేయంగా సాధించగలిగిందని సమావేశంలో పేర్కొన్నారు. ఇది ‘ఎజెండా 2030’ లక్ష్య విజయానికి శుభ ప్రారంభంగా చెప్పాలి. ముఖ్యంగా పేదరిక నిర్మూలనాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇది బాగా ఫోకస్ అవడంలో స్థిరమైన పాత్ర పోషించారు. ఈ సమావేశం పలు కార్యక్రమాల గురించి వివరించింది. ఇవి పేదరిక నిర్మూలనా దిశగానే కాకుండా అందరినీ కలుపుకుపోవడం, ప్రపంచానికి సరికొత్త ‘ఆశ’ను చూపడం ప్రధానంగా పెట్టుకున్నాయి. ఇవి చేపట్టిన కార్యక్రమాలలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫైనాన్సియల్ ఇంక్లూషన్ పథకం...

ఉగ్రవాదంపై తన  ఉద్దేశాన్ని ఫిన్లాండ్‌కు స్పష్టం చేసిన భారత్

భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి డా. ఎస్ జైశంకర్ మూడు రోజుల పర్యటనకు ఫిన్లాండ్ వెళ్లారు. కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత నోర్డిక్ దేశంలో పర్యటించడం ఆయనకు ఇదే తొలిసారి.1950 నుంచి సంప్రదాయబద్ధంగా అత్యున్నత స్థాయి పర్యటనలు ఆ దేశంతో చోటుచేసుకుంటూనే వస్తున్నాయి. ద్వైపాక్షిక అంశాల మీద దృష్టి నిలపడం కన్నా కూడా ఫిన్లాండ్ ప్రస్తుతం యురోపియన్ కూటమి ఛైర్మన్‌గా వ్యవహరిస్తోంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎంతో స్నేహంగా, సహృదయ వాతావరణంలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. కారణం పొరుగుదేశంలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలే. ఫిన్లాండ్‌కు చెందిన అత్యున్నత అధికారులతో డా. జైశంకర్ విస్తృతస్థాయిలో సరిహద్దు తీవ్రవాదంపై చర్చలు జరిపారు. భారత్ 370వ రాజ్యాంగ అధికరణ రద్దు చేసిన అనంతరం అంతర్జాతీయ సమాజం ముందు పొరుగుదేశమైన పాకిస్తాన్ లేనిపోని కథలను కశ్మీర్‌పై అల్లి ప్రపంచదేశాలను తప్పుదారిపట్టించే ప్రయత్నాలు చేస్తోంది. జైశంకర్ ఫిన్నిష్ ప్రధాని అంట్టిరిన్నెతో కూడా చర్చలు జరిపారు. అంతేకాదు ఆ దేశ విదేశాం...

కరేబియన్, ఫసిఫిక్ దీవులతో సంబంధాలను సమీక్షించిన భారత్

కరేబియన్ దేశాలతో భారత్‌కు చారిత్రకంగా ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సిఎఆర్ఐసివొఎం బృందంలోని 14 మంది దేశాల నాయకులతో జరిపిన సమావేశం ఈ సంబంధాలను మరింత వేగవంతం చేస్తాయనడంలో సందేహం లేదు. ఈ సమావేశాలను న్యూయార్కులో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సందర్భంగా విడిగా ప్రధాని చేపట్టారు. సెయింట్ లూసియా ప్రధాని అలెన్ ఛేస్టెనెట్ ప్రస్తుత ‘కారికోమ్’( కరేబియన్ కమ్యూనిటీ) సమావేశానికి కో-ఛైయిర్‌గా వ్యవహరించారు. ఈ సమావేశానికి ఆంటిగ్వా, బర్బుడా, బార్బోడస్, డొమినికా, జమైకా, సెయింట్ కిట్స్, నెవిస్, సెయిట్ టూసియా, సెయింట్ విన్సెంట్ ట్రెనడైన్స్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధిపతులు హాజరయ్యారు. అంతేకాదు సురినామా వైజ్‌ప్రెసిడెంట్, బహమాస్, బెలిజె, గ్రెనడా, హైతీ, గుయానా దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు.  ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి కారికోమ్ నాయకులను కలిశారు. ప్రాంతీయ అంశాల దృష్టిలో ఈ సమావేశం జరిగింది. కరేబియా, భారత్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు కూడా సుస్థిరంగా వృద్ధిచెందుతాయనే అంశం కూడా సమావేశంలో కీలకంగా చోటుచేసుకుంది. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను ‘కారికోమ్’ దేశాలతో బలోపే...

భారత-అమెరికాల ద్వైపాక్షిక సమావేశం

దౌత్యనీతిని నెరపడంలో సమకాలీన ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్రమోదీకి మించిన నాయకుడు లేరు. ప్రపంచంలో ఎక్కడికి పర్యటనకు వెళ్లినా అక్కడి నాయకులను తన ప్రసంగం, చర్యలతో సమ్మోహన పరచడంలో ఆయన దిట్ట. వారినే కాదు చట్టరూపకర్తలు,ప్రజలు, వీరందరినీ భారత్‌కు ఆత్మీయులుగా, సన్నిహిత భాగస్వాములుగా మలుస్తారు. ప్రధానమంత్రిలోని ఈ సామర్థ్యం ఇటీవల ముగిసిన హోస్టన్ కార్యక్రమంలో మరింత ప్రదర్శితమైంది. అప్పటికే ఆయన అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వ్యక్తిగతంగా ఆరు పర్యాయాలు ఒవల్ ఆఫీసులో సమావేశమయ్యారు. భారత-అమెరికా సంబంధాలలో ఇది పెద్ద రికార్డుగా పేర్కొనాలి. ప్రస్తుతం ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య సోమవారం న్యూయార్కులో వ్యక్తిగతంగా సంభాషణలు జరిగాయి. ఇద్దరూ కలిసి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ వార్షిక సమావేశానికి వెళ్లారు.భారత-అమెరికా ద్వైపాక్షిక సమావేశం పెద్ద ప్రదేశంలో జరిగింది. బహుపక్ష దౌత్యసంబంధాలు లక్ష్యంగా జరిగిన ఈ సమావేశం గ్లోబల్‌గా ప్రపంచాన్ని ఆకట్టుకుంది. నిజానికి చెప్పాలంటే ఇది ఇరుదేశాల నాయకులు చాలా స్వల్ప వ్యవధితో జరిపిన సమావేశమే కానీ అందులో ఎన్నో కీలకమైన అంశాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని మ...

వాతావరణ మార్పులు అసలు సవాలు: ఐక్యరాజ్యసమితిలో ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటన

స్వీడన్‌కు చెందిన పదహారేళ్ల గ్రెటా థన్‌బర్గ్ పర్యావరణ కార్యకర్తగా పనిచేస్తున్నారు. న్యూయార్కు ఐక్యరాజ్యసమితి సమావేశంలో థన్‌బర్గ్ ఎంతో దు:ఖంతో చేసిన విజ్ఘప్తి యుఎన్ అసెంబ్లీలోని ఎందరో నాయకుల అంతరాత్మలను కుదిపేసింది.  ‘‘ భవిష్యత్తు తరాల కళ్లు మీ మీదే ఉన్నాయి. మేం వైఫల్యం చెందితే, ఎప్పటికీ క్షమించం’ అని గ్రేటా ప్రపంచ నాయకులపై సవాలు విసిరారు.  మానవ ఉనికికి నేడు పొంచి ఉన్న అతి పెద్ద ప్రమాదం వాతావరణ మార్పు. వాతావరణ వ్యవస్థలో అనూహ్యమైన మార్పులు ప్రపంచమంతటా విపరీత పరిణామాలకు దారితీస్తున్నాయి.  ‘ఎంతో సీరియస్ సమస్య అయిన వాతావరణ మార్పును అధిగమించాల్సిన అవసరాన్ని మనం అంగీకరించాలి. అందుకే ఇప్పుడు మనం చేస్తున్న పని సరిపోదు’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ యుఎన్ సమావేశంలో ప్రపంచ నాయకులకు వెల్లడించారు. ‘ప్రవర్తనా పరమైన మార్పు తేవడానికి గ్లోబల్ స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని సమావేశంలో అభిప్రాయపడ్డారు.  ‘దురాశగా ఉంకూడదనేది మార్గదర్శక నిబంధనగా ఉండాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ ప్రత్యేక శిఖరాగ్రసభలో అభిప్రాయపడ్డారు. ఈ అంశ...

హౌడీ మోది- అపూర్వ ఘటన

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా సంయుక్తరాష్ట్రాల పర్యటన ‘హౌదీ మోదీ’ కార్యక్రమంతో అత్యంత విజయవంతంగా మొదలైంది. ఈ కార్యక్రమం టెక్సాస్‌లోని హూస్టన్‌లో జరిగింది. మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరువురూ ఈ వేదికపై పాల్గొన్నారు. ఈ వేదికపై నుంచి మోదీ 50 వేల ఇండో-అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు కూడా.  భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలోని భారత కమ్యూనిటీని ఉద్దేశించి 2014లో న్యూయార్కులోని మాడిసన్ స్క్వేర్‌లో ప్రసంగించడం గుర్తుండే ఉంటుంది. అంతేకాదు 2015లో శాన్ జోస్‌లో కూడా మోదీ మాట్లాడారు. అయితే హూస్టర్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొనడంతో అది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లతో పాటు సీనియర్ డెమోక్రాట్, కాంగ్రెస్ సభ్యుడు అయిన స్టెనీ హోయర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత, అమెరికా సంబంధాలలో ద్వైపాక్షిక మద్దతును నొక్కి చెప్పారు.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సభకు పరిచయం చేస్తూ ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రపంచంలోని రెండు అతి పెద్ద ప్రజాస్వా...

మంగోలియా అధ్యక్షుడు భారత పర్యటనతో పునరుద్ధరించబడిన సంబంధాలు

మంగోలియా అధ్యక్షుడు ఖాల్ట్‌మాగిన్ బట్టుల్గా భారత దేశంలో అధికారిక పర్యటన చేశారు. భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ప్రత్యేక ఆహ్వానంపై మంగోలియా అధ్యక్షుడు మన దేశాన్ని సందర్శించారు. గత దశాబ్దకాలంలో ఒక మంగోలియా అధ్యక్షుడు భారతదేశాన్ని పర్యటించడం ఇదే తొలిసారనొచ్చు. మంగోలియా అధ్యక్షుడితో పాటు ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారుల బృందం, వాణిజ్యాధినేతలు కూడా వచ్చారు.  మంగోలియా అధ్యక్షుడు బట్టుల్గా భారత రాష్ట్రపతి కోవింద్‌తో విస్తృతస్థాయిలో చర్చలు చేశారు. భారతదేశంలో పర్యటిస్తున్న మంగోలియా అధ్యక్షుడు గౌరవార్థం భారత రాష్ట్రపతి కోవింద్ విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా మంగోలియా అధ్యక్షుడిని గౌరవపురస్కకరంగా కలిశారు. ప్రతినిధుల స్థాయి సమావేశాన్ని మంగోలియా అధ్యక్షుడితో భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించారు. ఇరు దేశాలూ విస్తృతస్థాయిలో ద్వైపాక్షిక అంశాలపై సంభాషణలు జరిపారు. అలాగే ప్రాంతీయ, గ్లోబల్ అంశాలపై కూడా చర్చలు జరిపారు. సామర్థ్య పెంపుదల, రక్షణ, భద్రత, మౌలికసదుపాయాలు, ఎనర్జీ, ప్రకృతి వైపరిత్యాల వల్ల సంభవించిన నష్ట నిర్మూలనా నిర్వహణ, సాంస్కృతికంగా ఇచ్చిపుచ్చుకోవడాలు వంటి వాటిల్...

ఐఎఎఫ్: గేమ్-ఛేంజర్

భారత వైమానిక దళం రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రెంచి డస్సాల్ట్ ఏవియేషన్ నుంచి వచ్చే నెల రెండవ వారంలో పొందడానికి సర్వం సన్నద్ధమైంది. తొలి రాఫెల్ జెట్‌ను స్వీకరించడానికి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్ వెడతారు. భారత వైమానిక దళం 24 మంది పైలట్లను మూడు బ్యాచులుగా చేసి వచ్చే ఏడాది మే దాకా వారికి శిక్షణ ఇస్తారు. అదే సమయంలో తొలి విడత రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరతాయి. వేగంగా రాఫేల్ యుద్ధవిమానాలను భారత్‌కు డెలివరీ చేయాలనుకోవడానికి హేతుబద్ధత లేకపోలేదు. న్యూఢిల్లీలోని రక్షణ వ్యూహాత్మక నిపుణులు మూలపడి ఉన్న వందల కొద్దీ కాలంచెల్లిన ఐఎఎఫ్ ఎంఐజి-21, ఎంఐజి-23, ఎంఐజి-27 యుద్ధవిమానాలను తొలగించాలని గుంజాటన పడుతన్నారు. ఇవన్నీ సర్వీసులోంచి ఒక్కొక్కటిగా తీసేసినవి.  గత కొన్ని దశాబ్దాలుగా భారత పొరుగుదేశాల్లో తలెత్తుతున్న పరిణామాలు, పెరుగుతున్న సరిహద్దు తీవ్రవాదం ఇందుకు కారణం. ఇటీవల కాలంలో భారత రక్షణ విధానంలో కూడా మార్పులు పొడసూపడం గమనించవచ్చు. పొరుగు దేశాలు ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేసే ధోరణిని అనుసరించాలన్న విధానాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. అంతేకాదు దీనికి సంబంధించి భ...

అరామ్కో దాడులతో యుఎస్-ఇరాన్ దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తత

దమ్మామ్ సమీపంలోని అబ్ఖాక్, ఖురైస్‌లో ప్రపంచంలోనే భారీ స్థాయిలో ముడిచమురు సదుపాయలు ఉన్న విషయం తెలిసిందే. దీనిని సౌదీ అయిల్ జెయింట్ అయిన ఆరామ్కో నిర్వహిస్తోంది. ఆ రెండు ప్రాంతాలపై డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడులు అమెరికా-ఇరాన్ల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను మరింత తీవ్రతరం చేశాయి. దీంతో 1991లో గల్ఫ్ యుద్ధం సమయం నుంచి అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి.యెమన్ ఉనికిగా ‘అన్సార్ అల్లా’ (హోథీ) దళాలు ఈ దాడులకు తామే బాధ్యులమంటూ ప్రకటించాయి. ఈ దాడుల్లో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. అయితే ఇటువంటి దాడులు సౌదీ అరేబియాలో ముందు ముందు మరిన్ని జరుగుతాయంటూ హోథీ దళాలు హెచ్చరించాయి. సౌదీ చమురు స్థావరాలపై దాడికి పాల్పడడం ఇదే మొదటిసారి కాదు. గత నెల సౌదీ అరేబియాకు చెందిన మరో పెద్ద చమురు ఫీల్డ్ అయిన షేబాను కూడా హౌథీలు తమ డ్రౌన్ దాడిలో టార్గెట్ చేశాయి.  సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబిఎస్) ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. దాడులను నిలువరించడానికి సౌదీ సిద్ధంగా ఉందని, దాడులను ఎదుర్కొనే సామర్థ్యం కూడా తమకు ఉందని అన్నారు. అత్యంత ప్రభావమైన దాడుల వల్ల, రియాద్ రోజుకు 0.2 మిలియన్ బారల...

ఇండియా-ఇరాన్ల మధ్య సహకారానికి నూతన వ్యూహాల శోధన

భారత, ఇరాన్ దేశాల మధ్య పదవ పర్యాయం విదేశాంగ శాఖల సమాలోచనలు ఈ వారం టెహ్రాన్‌లో జరిగాయి. అక్కడ ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వ్యూహాత్మకంగా గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే భారత ప్రతినిధి బృందానికి సారథ్యం వహించారు. ఇరాన్ వైపు నుంచి ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి డా. సయ్యద్ అబ్బాస్ అరాంఘఛీ ఇరాన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. ఇరాన్ విదేశాంగ వ్యవహారాల మంత్రి డా. జవాద్ జారిఫ్, ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయితుల్లా ఖొమైని సీనియర్ సలహాదారు డా. ఆలి అక్బర్ వెలయతితో భారత విదేశాంగ కార్యదర్శి గోఖలే చర్చలు జరిపారు.  రెండు దేశాలూ తమ మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి సమగ్ర స్థాయిలో పునర్ అంచావేశారు. వాటిల్లో అనుసంధాన కార్యక్రమం, మౌలికసదుపాయాల కల్పన ప్రాజక్టులైన డెవలెప్‌మెంట్ ఆఫ్ షాహిద్ బెహెస్తి పోర్ట్, ఛబాహార్, భారత్, ఇరాన్, అఫ్ఘనిస్తాన్లతో కూడిన ట్రైలేటరల్ ట్రాన్సిట్ ఒప్పందం సహకారం విషయంలో రెండు దేశాలవారూ పునరంచనా వేశారు. వీటితో పాటు ప్రాంతీయ అంశాలను కూడా రెండు దేశాలూ చర్చించాయి. ఇరుదేశాలకు పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక సంబంధాలను మర...

రాష్ట్రపతి కోవింద్ ఐస్‌ల్యాండ్‌, స్విట్జర్లాండ్, స్లోవేనియాల పర్యటన

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తొమ్మిది రోజుల విదేశీ పర్యటన చేస్తున్నారు. ఐస్‌ల్యాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియాలలో పర్యటించారు. ఈ దేశాలతో ద్వైపాక్షిక రాజకీయ, ఆర్థిక సంబంధాల పెంపుదల లక్ష్యంగా ఈ పర్యటనలు రాష్ట్రపతి చేపట్టారు. భారత్, ఐస్‌ల్యాండ్‌లు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఫిషరీస్ కొలాబరేషన్‌కి సంబంధించి పరస్పర ఒప్పందాలు చేసుకున్నాయి. అంతేకాదు సంస్కృతి, సహకారం, అధికారులకు వీసా కేటాయింపులు, యూనివర్సీటీ ఆఫ్ ఐస్‌ల్యాండ్‌లో హిందీ ఛైయిర్ ఏర్పాటు కూడా వాటిల్లో ఉన్నాయి. నోర్డిక్ గ్రూప్ దేశాలలో ఐస్‌ల్యాండ్ కూడా ఒక భాగమే. ఐస్‌ల్యాండ్ రాష్ట్రపతి రెక్‌జావిక్ మాట్లాడుతూ సుస్థిరమైన మత్యసంపద, సముద్ర ఆర్థిక వ్యవస్థ, షిప్పింగ్, గ్రీన్ గ్రోత్, ఎనర్జీ, నిర్మాణం, వ్యవసాయరంగాలలో తమ వంతు సహకారం అందజేస్తామని అన్నారు. ఆర్కిటిక్ కౌన్సిల్‌కు ఛెయిర్‌గా ఐస్‌ల్యాండ్ వ్యవహరిస్తోంది. ఇది అంతర్ ప్రభుత్వాల మధ్య పనిచేసే సంస్థ. ఈ సంస్థ ఆర్కిటిక్‌లో సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణపై దృష్టిసారిస్తుంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత సభ్యత్వానికి సైతం ఐస్‌ల్యాండ్ తన మద్దతును అందిస్తోంది. రాష్ట్రపతి కోవింద్ ...

రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తున్న పాకిస్తాన్

ప్రస్తుతం పాకిస్తాన్ గందరగోళ స్థితిలో ఉంది. జమ్ము,కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం దాన్ని తీవ్ర సందిగ్ధ పరిస్థితిల్లోకి నెట్టింది. ప్రతి గ్లోబల్ దేశమూ పాకిస్తాన్ వైఖరి పట్ల అసంతృప్తిగానే ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా జమ్ము,కశ్మీర్‌కు చెందిన భారత రాజ్యాంగంలోని 370 అధికరణ రద్దు భారత అంతర్గత విషయంగా అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఈ అంశంపై మద్దతు కోసం ప్రపంచదేశాలన్నింటినీ కలిసి ప్రయత్నిస్తోంది. కానీ ఈ విషయంలో పాక్ చేస్తున్న ప్రయత్నాలనీ అంతుచిక్కకుండా ఉన్నాయి.  ఒక ప్రైవైటు టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ పాకిస్తాన్ భారత్‌పై సంప్రదాయ యుద్ధం నెగ్గే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు భారత్ నుంచి అణు ప్రమాదం పొంచి ఉందంటూ ఇమ్రాన్ ఖాన్ పునరుద్ఘాటించారు. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయంగా అన్ని దేశాలూ దృష్టి పెట్టాలన్నారు. భారత అణుకార్యకలాపాలపై ప్రపంచం దృష్టి సారించకపోతే తర్వాత తలెత్తే అనూహ్య విపత్తులకు ప్రపంచదేశాలు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. అంతేకాదు పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని ప్రపంచానికి స్పష్టేంశానని అన్నారు. అదే స...

భూక్షీణతను తగ్గిస్తామంటూ దేశాల ప్రతిన

భూమి చాలా క్లిష్టమైన వనరు. మానవజీవితాలకు కావలసిన ప్రాథమిక జీవనోపాధులను ఇది అందిస్తుంది. మనుషులు బాగా బతికేట్టు చేస్తుంది. అందులో ఆహారం, స్వచ్ఛమైన నీరు, ప్రకృతి సమతుల్యతతో కూడిన వ్యవస్థ ఇలాంటి వన్నీ అందిస్తుంది. అంతేకాదు జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడుతుంది. వాతావరణ వ్యవస్థలో సైతం భూమి కీలక పాత్ర పోషిస్తుంది. దశాబ్దాలుగా భూమిని బాగా వాడాం. జనాభా పెరుగుదల కారణంగా జలవనరుల వాడకం పెరిగి భూ క్షీణదల మొదలైంది. వ్యవసాయం, పశుత్పత్తి, పట్టణీకరణ, అడవులు నరకడం, విపరీతమైన వాతావరణ పరిస్థితులు, మరీ ముఖ్యంగా కరువు వంటివి భూక్షీణతను మరింత పెంచాయి. మానవులు 70 శాతం మంచురహిత భూమిని దెబ్బతీశారు. పలు దేశాల్లో భూక్షీణత, ఎడారీకరణలు ప్రధాన ఆర్థిక, సామాజిక, పర్యావరణ సమస్యలుగా నిలిచాయి. దీంతో ఫలవంతమైన భూమి కూడా ఎడారీగా మారుతోంది. ఈ మార్పలను చర్చించాలి. ఈ సవాళ్లను అధిగమించే మార్గాలను పట్టుకోవాలి. సెప్టెంబరు రెండవ తేదీన ఢిల్లీ పొలిమేరల్లో పధ్నాల్గవ కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్ (సివొపి 14)లో అదే జరిగింది. ఈ సదస్సులో 197 దేశాల నుంచి తొమ్మిదివేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. పధ్నాల్గవ కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్‌లో ఈ మార్పులన...

ట్రంప్ తాలిబాన్‌తో చర్చలు రద్దు చేయడంతో అసంపూర్ణ స్థితిలో ఆఫ్ఘనిస్తాన్

పధ్నాలుగుమంది సభ్యులతో కూడిన శాంతి ప్రతినిధివర్గం ఈ సంవత్సరం ప్రారంభంలో తాలిబాన్ ఏర్పాటుచేసింది. ఈ ప్రతినిధి వర్గం ఎంతో క్లిష్టమైన శాంతి సంభాషణలను అమెరికాతో చేయాలి. ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, తాలిబాన్‌కు యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో సైతం ఇవి చర్చలు కొనసాగించాల్సి ఉంటుంది. విచక్షణారహితంగా, పౌరులను టార్గెట్ చేస్తూ ఎంతో నిర్దయగా తాలిబాన్ దాడులు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో చర్చలు సరైన దారిలో ప్రారంభదశ నుంచి కొనసాగించడం చాలా కష్టంతో కూడుకున్నది.  ఈ సంభాషణల ప్రధాన లక్ష్యం విస్తృతస్థయిలో రాజకీయ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలన్నది. దాని ద్వారా తాలిబాన్ల ఆశలను తీర్చడంతోపాటు కాబూల్‌ రాజకీయ వ్యవస్థలాంటి ప్రధాన స్రవంతిని కూడా చేర్చుకోవడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. కౌంటర్ టెర్రరిజంపై సంభాషణల్లో ప్రధానంగా చర్చించారు. ఈ గ్యారెంటీనే తాలిబాన్ నాయకులు అమెరికాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ తిరిగి 1990 నాటి పరిస్థితులకు వెళ్లదు. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్కులకు నిలయంగా ఉండేది. కౌంటర్ టెర్రరిజం గ్యారంటీ మెకానిజంను కొనసాగిస్తామని మాట ఇస్తే, పూర్తిస్థాయి దౌత్య ఉ...

ఆర్‌సిఇపి ఏడవ సమావేశం

రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ (ఆర్‌సిఇపి) సమావేశం ఇటీవల బ్యాంకాక్‌లో జరిగింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ నేపథ్యంలో ఇది జరిగింది. అంతేకాదు జపాన్, దక్షిణ కొరియా మధ్య ఆర్థికపరమైన సంబంధాలు కూడా బాగా ముసురుపట్టి ఉన్నాయి. పోయిన నెలలో ఆర్‌సిఇపి సమావేశం జరిగింది. భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలలో భారత డైనమిజం ఎంతో శక్తివంతమైంది. మంత్రి పీయూష్ గోయల్ మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. దేశానికి సంబంధించిన బహుపక్ష, ద్వైపాక్షిక కార్యక్రమాల ఎజెండాలతో సభ్యదేశాల మంత్రులతో సమావేశం జరిగింది.  ఆర్‌సిఇపిలో ఆగ్నేయాసియా దేశాల కూటమికి (ఆసియాన్)సంబంధించిన పదిమంది సభ్యులతో పాటు ఆరు మంది ప్రాంతీయ దేశాలూ ఉన్నాయి. ఇండియా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా వీటిల్లో ఉన్నాయి. మొత్తం ఆసియాన్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్య ప్రతిపాదనలు కూడగట్టడానికి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటుచేశారు. ఏడవ మంత్రివర్గ సమావేశం అనంతరం ఇందులో పాల్గొన్న 16 దేశాలు సమిష్టిగా ఒక ప్రకటనను విడుదలచేశాయి. ప్రకటన విడుదల చేయడానికి ...