ట్రంప్ రెండు దేశాల ప్రణాళిక
మెడ మీద అధికార కత్తి వేళ్ళాడుతున్న నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నేతన్యాహూ, ఇజ్రాయిల్, పాలెస్తేనియా ఘర్షణలకు స్వస్తి పలికే శాంతి ఒప్పందం పై చర్చించేందుకు, శ్వేత సౌధంలో సమావేశమయ్యారు. శాంతి - సౌభాగ్యపత్రంగా పేర్కొన్న 180 పేజీల ఈ ప్రణాళిక ‘ఇజ్రాయిల్, పాలెస్తేనియా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపైచేందుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయిల్ అధికారులు, అరబ్ నాయకులతో నెలల తరబడి చర్చలు జరిపిన అధ్యక్షుడు ట్రంప్ మధ్యప్రాచ్య వ్యవహారాల కీలక సలహాదారు జారెడ్ కుష్నెర్ పాలెస్తీనియాను మాత్రం నిర్లక్ష్యం చేశారు. పాలేస్తేనీయుల అభిప్రాయాలను అంతగా పట్టించుకోలేదు. నిజానికి ఆ దేశ ప్రతినిధులతో ఎలాంటి చర్చలు జరపలేదు. అధ్యక్షుడు ట్రంప్ ఈ ప్రణాళికను, ‘వాస్తవ శాంతి ప్రణాళిక’ గా అభివర్ణించారు. అలాగే, పాలెస్తేనియాకు ఇదే చివరి అవకాశమని ట్రంప్ పేర్కొన్నారు. కాగా నేతన్యాహూ ఈ ప్రణాలికను చారిత్రిక పత్రంగా పేర్కొన్నారు. ఇది, పాలెస్తీనియా ప్రజల న్యాయమైన ఆకాంక్షలను, స్వయం నిర్ణయాధికారాన్నిగుర్తిస్తోంది, గౌరవిస్తోందని, నేతన్యాహూ అన్నారు. అయిత అదే సమయంలో జెరూసలేం ఇజ్...