Posts

ఊపందుకున్నఅమెరికా అధ్యక్ష ఎన్నికల సన్నాహాలు

మరికొద్ది నెలల్లో ... రానున్న 2020 నవంబర్’లో అమెరికా 46 వ అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది.ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా రాజకీయాలలో కురువృద్ధ పార్టీ ..రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా మరోమారు పోటీచేసేందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్’ సిద్ధమయ్యారు.చురుగ్గా అడుగులు వేస్తున్నారు.ఇంతవరకు వివిధ స్టేట్ ప్రైమరీస్ ,కాకసస్’లో 1099 ప్రతినిధులను ట్రంప్ గెలుచుకున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్ధిగా నామినేషన్ పొందేందుకు ట్రంప్’కు మొత్తం 1276 ప్రతినిధి ఓట్లు అవసరం. ఆ మార్క్ చేరితే ఆయన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా నిలుస్తారు. ఇక డెమొక్రటిక్ పార్టీ విషయానికి వస్తే, మాజీ ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్, వెర్మాంట్ సెనేటర్ బెర్నీ సాండర్స్ మధ్య నువ్వా నేనా అన్న విధంగా పోటీ నెలకొంది. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్న వారిలో ఈ ఇద్దరి మధ్యనే పోటీ నడుస్తోంది. అయితే, ‘Super Tuesday’ ప్రైమియర్స, కొన్ని కీలక రాష్ట్రాల్లో ఆధిక్యత సాధించడంతో బిడెన్ ముందంజలో ఉన్నారు. మొత్తం 14 రాష్ట్రాలు సహా అమెరికన్ సమోవాలో మంగళవారం అధ్యక్ష అభ్యర్ధి ఎంపిక ఎన్నికకు presidential prim...

చమురు ధరల యుద్ధం 

ముడి చమురు ధరలను సౌదీ అరేబియా ‘బ్రెంట్’ ఒక్కసారిగా 30 శాతం తగ్గించాయి. చమురు యుద్ధం మొదలైంది. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత ఒక్క సారిగా ఇంత పెద్ద మొత్తంలో చమురు ధరలు తగ్గడం లేదా తగ్గించడం, ఇదే మొదటి సారి కావడం విశేషం. సౌదీ అరేబియా , రష్యాల మధ్య చమురు ధరలు తగ్గించే విషయంలో విబేధాలు తలెత్తడంతో ఇలా ఒక్కసారిగా ముడి చమురు ధరలు దిగివచ్చాయి. కరోన వైరస్ వ్యాప్తి కారణంగా చమురు కొనుగోలు డిమాండ్ తగ్గింది. దీంతో సౌదీ అరేబియా సారధ్యంలోని, పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ, ఒపెక్, చమురు ఉత్పత్తిని రోజుకు 1.5 మిలియన్ బ్యారెల్స్ కు కుదించాలనుకుంది.అయితే అందుకు రష్యా చమురు ఉత్పత్తి తగ్గించేందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా, సౌది అరేబియా కంపెనీ బ్రెంట్, ఈ శతాబ్దిలోనే కనిష్ట ధరను ప్రకటించి,చమురు ధరల యుద్దానికి తెర తీసింది. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఫైనాన్సియల్ మార్కెట్లను, రియల్ ఎస్టేట్ రంగాన్ని అన్నిటికంటే ముఖ్యంగా ఇంధన రంగంలో పెట్టుబడులను దెబ్బతీయడం మొదలైంది. సౌది అరేబియా చమురు ఉత్పత్తి వ్యయం ఇతర అన్ని దేశాలకంటే లభాలలు చాలా తక్కువ. అంత చౌకగా చమురు ఉత్పత్తి చేయడం మరో దేశానికి సాధ్యం కాదు.చమురు ఉత్పత్తి వ్యయ...

కొరియా ద్వీపకల్పంలో పెరుగతున్న ఉద్రిక్తతలు

ఈ వారం ప్రారంభంలో ఉత్తర కొరియా మూడు అదృశ్య ప్రక్షేపకాలను ప్రయోగించింది. రెండు వారల సమయంలో కిమ్–జాంగ్- యున్ ప్రభుత్వం రెండవ సారిఇలాటి చర్యకు పాల్పడింది. తొలి ప్రయోగాన్ని ఖండిస్తూ, ప్రతీకార చర్య తప్పదని దక్షిణ కొరియా హెచ్చరించిన రెండు రోజులకే ఉత్తర కొరియా రెండవ సారి ప్రక్షేపకాలను ప్రయోగించింది. . ఆదేశ తూర్పు తీర ప్రాంతం నుంచి కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య జలాలలోకి స్వల్ప సామర్ధ్యంగల విభిన్న ప్రక్షేపకలాను ఉత్తర కొరియా ప్రయోగించిందని, దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తర కొరియా గరిష్టంగా 200 కిలోమీటర్లు దూరంలోని, 50కిలోమీటర్ల ఎత్తులోగల ల్లక్ష్యాలను ఛేదించే సామర్ధ్యం గల ప్రక్షేపకాలను ప్రయోగించింది. ఉత్తర కొరియా మరో మారు ఇలాంటి చర్యలకు పాల్పడితే వాటిని ఎదుర్కునేందుకు తమ సేనలు సిద్ధంగా ఉన్నాయని దక్షిణ కొరియా పేర్కొంది. కొరియా ద్వీప కల్పంలో సైనిక ఉద్రిక్తలను చల్లబరిచి, ప్రశాంత వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు 2018లో ఉభయ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘిస్తోందని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది. అంతేకాదు, ఇలాంటి ఉల్లంఘనలను ఉపేక్షించబోమని హెచ్చరిస్తోంది. కాగా, గత సంవ...

ఉగ్రవాదం పై మరోసారి బహిర్గతమైన పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి

తమ భూభాగం నుండి కార్య కలాపాలు సాగిస్తున్న ఉగ్రబృందాల తో పాకిస్తాన్ వ్యవహరించే తీరు అందరకు తెలిసిందే. భౌగోళిక ఉగ్రవాది మసూద్ అజార్ పై పారిస్ లో అంతర్జాతీయ ఆర్ధిక కార్యాచరణ సంస్థ FATF ప్లీనరీ ఎదుట ఆ దేశం పచ్చి అబద్ధాలు చెప్పడం తో ఆ ద్వంద్వ వైఖరి మరో సారి బహిర్గతమైంది. అధికారిక రక్షణ లో ఈ ఉగ్రవాద సూత్రధారి పాకిస్తాన్ లో తల దాచుకుంటున్నాడు. ఉగ్రవాద బృందాలపై తాము చర్యలు తీసుకుంటున్నట్లు ప్రపంచానికి చూపేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. అయితే వాస్తవం లో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రదాడులకు కారకులైన మసూద్ అజార్,హఫీజ్ మహమ్మద్ సయీద్,జాకీర్ ఉర్ రహ్మాన్ లఖ్వీ తదితర అనేక మంది ఉగ్రవాదుల పై విచారణ చేబట్టడం,సరైన జరిమానా విధించడాలు చేబట్టలేదు. 2019 ఫిబ్రవరి 14 న 40 మంది కేంద్ర రిజర్వ్ పోలీస్ సిబ్బందిని జమ్మూ కాశ్మీర్ లో పుల్వామా ఉగ్రదాడిలో హతమార్చినట్లు ప్రకటించుకున్న జైషే మహమ్మద్ JEM దళ అధిపతి మసూద్ అజర్. 2019 ఫిబ్రవరి 26 న వైమానిక మెరుపు దాడి సలిపి బాలా కోట్ ప్రధాన కేంద్రాన్ని,జైషే మహమ్మద్ శిక్షణా స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అప్పటి నుండి మసూద్ అజర్ ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించవలసిన ఒ...

కాబూల్ లో కొనసాగుతున్న అనిశ్చితి

మార్చి నెల మొదట్లో ఆఫ్ఘనిస్తాన్ లో గణనీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.యుద్ధ ప్రభావిత దేశం లో అత్యావశ్యకమైన శాంతి పున రుద్ధరణ వేగవంతమయేలా సులభతర ఆఫ్ఘన్ అంతర చర్చల ప్రక్రియకు ఫిబ్రవరి 29 న అమెరికా తాలిబన్ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘన్ సమాజం లోని తీవ్రవాద ప్రతినిధులతో చర్చలకు ఆ దేశ శాంతి కాముకుల పక్షాన ఆఫ్ఘన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం సంఘటితమౌతుందని భావించారు .  అయితే ఆఫ్ఘన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రకటన తదనంతరం ఇపుడు అక్కడి లోతైన విభజనలు అగుపడుతున్నాయి. ప్రస్తుతం కాబుల్ లో నెలకొన్న రాజకీయ గొడవల నేపధ్యం, సామరస్య పరిష్కారాన్ని ఆశిస్తున్న ఆఫ్ఘన్ ప్రజలలోనే కాక బాహ్య శక్తులకూ నిరాశ కలిగిస్తోంది. గత ఏడాది చివర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో అష్రఫ్ ఘనీ ని విజేతగా ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే అబ్దుల్లా అబ్దుల్లా నేతృత్వం లోని ప్రభుత్వం లోని మరో శక్తివంతమైన వర్గం, అధికారిక ప్రకటన ద్వారా తెలుపబడిన ఆష్రఫ్ ఘనీ విజయానికి పోటీ పడింది. ఆయనను రెండవసారి అధ్యక్షునిగా అంగీకరించలేని డా.అబ్దుల్లా అబ్దుల్లా అదే క్షణాన తదుపరి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబూల్ లో ప్రస్తు...

విదేశాంగ విధానంతో వాణిజ్యాన్ని సమన్వయం చేసిన భారత్

నరేంద్రమోడీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి, NDA ప్రభుత్వం, విదేశాంగ విధానం లో బిజినెస్ టు బిజినెస్,B2B పై దృష్టి నిగిడ్చింది. వాటిలో భాగస్వామి దేశాలకు తక్కువ వడ్డీతో దశాలవారి రుణ సదుపాయం లైన్ ఆఫ్ క్రెడిట్ ను విస్తరించడం గమనార్హం. వందల సంఖ్యలో ఉన్న అవి గత కొన్ని సంవత్సరాలుగా స్థాయి,సంక్లిష్టత,వైవిద్యాలలో పెరిగాయి. వాటి పరిధి విదేశాలలో ప్రాజెక్టుల అమలు నుంచి సేవలవిస్తరణ,ఉత్పత్తుల సరఫరా వరకు ఉంది. విదేశాంగమంత్రి డా.జైశంకర్ ఒక వాణిజ్యసదస్సులో భారత్ వ్యాపారాత్మక దౌత్యవిధానాన్ని ప్రస్ఫూటం గా వివరించారు. ఏ లైన్ ఆఫ్ క్రెడిట్ లో నైనా 65% నుండి 75% వరకు భారత్ కు చెందిన అంశం ఉండటమన్నది లైన్ ఆఫ్ క్రెడిట్ ల సామాన్య లక్షణం. ప్రతి ఒక్కటీ తమదైన శైలిలో భారత్ కంపెనీలకు విదేశాలలో మార్కెటింగ్ ను సమకూరుస్తుంది. సార్వభౌమ హామీ కలిగిఉండటంతో క్రెడిట్ లైన్లు,భారత్ కంపెనీల కార్యకలాపాలు సాగడానికి దోహదపడతాయి. లేకుంటే సాధారణంగా ఎదురయ్యే ఇక్కట్ల దృష్ట్యా భారత్ కంపెనీలు ఈ సాహసానికి పూనుకోవు. ఇప్పటివరకు 64 దేశాలలోని 539 ప్రాజెక్టులకు భారత్ 300 దశలవారి రుణ సౌకర్యాలను అందించింది. క్రెడిట్ లై...

చైనా పాకిస్తాన్ ఆర్ధిక కారిడార్ CPEC : పాకిస్తాన్ కు రుణభారం

'చైనా పాకిస్తాన్ ఆర్ధిక కారిడార్- CPEC పూ ర్తయితే అది బీజింగ్ కు నిస్సందేహంగా గెలుపు-గెలుపు ఒప్పందంగా ఉండనుంది. చైనా భూభాగం కలిగిన పశ్చిమ జింజియాంగ్ ప్రావిన్స్ ను బలుచిస్తాన్ లోని గ్వాడార్ నౌకాశ్రయంతో కలిపి, చైనాకు గల్ఫ్,హిందు మహాసముద్రాలలోకి ప్రవేశం కల్పించనుంది ఈ 62 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు. అయితే ఇది పాకిస్తాన్ ను ఎక్కడ ఖచ్చితంగా వదులుతుంది? ఈ ప్రాజెక్ట్ పై పాకిస్తాన్ లోని స్థానిక విమర్శకులతో సహా పలువురు విశ్లేషకులు కొంతకాలంగా అడుగుతున్న ప్రశ్న ఇది. CPEC , దాని అనుబంధ ఇతర ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగి పోవడం,నిర్ణిత గడువు లోపు పూర్తి కాకుండా వెనకబడటాల్ని ఇక్కడ ప్రస్తావించడం తో సరిపోదు. వీటిలో మెగా హైడెల్ పవర్ ప్రాజెక్ట్,పెషావర్ ను కరాచీ తో కలిపే మరింత ప్రతిష్ఠాత్మకమైన రైల్వే లైను కూడా ఉన్నాయి. రైల్వే మార్గ ప్రారంభ అంచనా వ్యయం 8.2 బిలియన్ల అమెరికా డాలర్లు. తదనంతరం ఈ ఖర్చుని 6.2 బిలియన్ల అమెరికా డాలర్లకు తగ్గించారు.ప్రాజెక్ట్ వ్యయం లో 2 బిలియన్ డాలర్ల ఆదా, వేడుకలు జరుపుకోదగిన అంశమే.అయితే వాస్తవ వ్యయం 9 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చునని ఇప్పుడు నివేదికలు తెలియజేస్తున్న...