రెండవసారి పదవీ ప్రమాణం చేసిన మోదీ ప్రభుత్వం
భారీ మెజారిటీతో దేశ ప్రజలు మోదీని గెలిపించిన తర్వాత నరేంద్ర మోదీ భారత ప్రధానిగా రెండవ పర్యాయం పదవీస్వీకార ప్రమాణం చేశారు. ప్రధాని నేతృత్వంలోని 58 మంది మంత్రులతో కూడిన మంత్రిమండలి చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. భారతీయ జనతాపార్టీ, మిత్రపక్షాలలోని ప్రతిభావంతులైన వారికి మంత్రి పదవులను ఇచ్చారు. వీరిలో భారత మాజీ కార్యదర్శి సుబ్రమణియన్ జైశంకర్ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ జైశంకర్ని ఎంపిక చేసుకోవడం కూడా ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. భారత విదేశాంగ మంత్రిత్వశాఖలో ముఖ్య సహాయకులుగా ఆయన ఉన్నారు. చైనా విషయంలో ఆయన చూపిన ప్రతిభాసామర్థ్యాలు ఆయనకు లాభకరంగా పరిణమించాయనడంలో సందేహంలేదు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను కూడా మోదీ ఈసారి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మోదీ ప్రభుత్వంలో అమిత్ షా కీలకపాత్ర నిర్వహిస్తారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ఈసారి బిజెపిని గెలిపించడం, రెండవసారి తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం వెనుక దేశంలోని ప్రజల ఆంకాంక్షలను వెల్లడిస్తోందంటూ మోదీ పలుమార్లు వ్యక్తం చేయడం మరవలేం. రాష్ట్రపతి ప్రమాణం స్వీకారం చేయించిన కేంద్ర మంత్రిమండలిలో పాన్-ఇండి...