దక్షిణ చైనా సముద్రం : ఒక శక్తివంతమైన క్రొత్త ఫ్లాష్ పాయింట్
చైనా, దక్షిణ సముద్రంలో రెడ్ లైన్ దాటిందని, వియత్నాం ప్రత్యేక ఆర్థిక జోన్ ని ఆక్రమించి అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపణ ఉంది. చైనా సర్వే ఓడ, వియత్నాంకు అరవై నాటికల్ మైళ్ల దూరంలో ఉందని ఆరోపణ. ఈ చర్య, వియత్నాం ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లే సూచన గా తోస్తోంది. నాలుగు ఎస్కార్ట్ నౌకలు వెంటరాగా, చైనా నౌక, వియత్నాం ప్రత్యేక ఆర్థిక మండలిని సర్వే చేస్తున్నదన్నది ఆరోపణ. ఆ నౌక అక్కడి నుంచి నూట రెండు కిలోమీటర్ల దూరంలోను,దక్షిణ వియత్నాం నగరం ఫుకి సముద్ర తీరం నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయ సమావేశ తీర్మానం మేరకు, ఒక దేశపు ఆర్థిక జోన్ సాధారణంగా దాన్ని తీరం నుంచి రెండు వందల నాటికల్ మైళ్ళ దూరం వరకు విస్తరించి ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులపై సార్వభౌమ హక్కులను కలిగి ఉంటుంది. దక్షిణ చైనా సముద్రంలో వాటా ఉన్న దేశాలు తక్షణమే ఈ సర్వే నౌకను ఇతర నౌకలను ఉపసంహరించుకోవాలని చైనాని కోరవలసి ఉంది. వియత్నాం తీర ప్రాంతానికి ఓడ దగ్గరగా చేరడాన్ని బట్టి, బీజింగ్, సముద్ర సామర్థ్యాన్ని విస్తరించే ఉద్దేశ్యంలో ఉన్నట్లు కనబడుతోంది. ఈ చర్య రష్యన్ పెట్రోలియం సంస్థ...